RCB, Rayudu : సంబరాలతో ట్రోఫీ గెలవలేరు… ఆర్సీబీపై రాయుడు కామెంట్స్

ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు పోరాటం ప్లే ఆఫ్స్ లో ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైంది.

ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు పోరాటం ప్లే ఆఫ్స్ లో ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో బెంగుళూరు జట్టుపై విమర్శలు మొదలయ్యాయి.

తాజాగా చెన్నై మాజీ ప్లేయర్ అంబటి రాయుడు.. ఆర్సీబీపై హాట్ కామెంట్స్ చేశాడు. డూ ఆర్ డై మ్యాచ్ లోచెన్నై సూపర్ కింగ్స్ పై ఆర్సీబీ గెలిచినప్పటినుంచి ఆ టీమ్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాడు. సీఎస్కేను ఓడించినంత మాత్రాన కప్ కొట్టినట్లు కాదు.. అంటూ తన కక్షను మరోసారి వెళ్లగక్కాడు.

ఈసారి నేరుగా కోహ్లీనే టార్గెట్ చేశాడు. ఐపీఎల్ ట్రోఫీలు ఏ సెలబ్రేషన్స్ కోసమో గెలవరనీ,. అలాగే దూకుడుతో కూడా ట్రోఫీలు గెలుపొందలేరంటూ వ్యాఖ్యానించాడు. ప్లే ఆఫ్స్ లో బాగా ఆడితేనే కప్ లు గెలుస్తారు అంటూ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసి విమర్శించాడు. చెన్నైపై విజయం సాధించాక కోహ్లీ చేసుకున్న గెలుపు సంబరాలను దృష్టిలో పెట్టుకునే రాయుడు ఈ కామెంట్స్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ఎలిమినేటర్ మ్యాచ్ లో కోహ్లీ అనుకున్న స్థాయిలో రాణించలేక పోయాడు.