BJP MLA Rajasingh : నేటి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు..

తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా.. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిన బీజేపీ ఆఫీస్ కు వెళ్లనున్న ఎమ్మెల్యేలు..

తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తర్వాత అక్కడి నుంచి నేరుగా.. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు.   బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేత ఎన్నుకుంటారు.  ఫ్లోర్ లీడర్ రేసులో బీజేపీ సీనియర్ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ ను, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి గెలిచిన వెంకటరమణారెడ్డి పేరు కూడా రేసులో వినిపిస్తోంది.

మరోవైపు ఇవాల్టి అసెంబ్లీ సమావేశాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిష్కరించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉండటంతో తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశానికి రావడం లేదని ఓ వీడియో రిలీజ్ చేశారు రాజాసింగ్. దేశాన్ని తిట్టే వారిని, పోలీసులకు వార్నింగ్ ఇచ్చే వారిని ప్రొటెం స్పీకర్ గా ఎలా చేస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్.