8 రోజులు.. 5 ప్లాన్‌లు.. బోట్లను ఎలా బయటకు తీశారంటే..

5 ప్లాన్‌లు.. 8 రోజులు.. పదుల మంది అధికారులు.. వందల మంది కార్మికలు.. వేల అనుమానాలు.. లక్షల మంది ఉత్కంఠ.. ఇదీ ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తీస్తున్నప్పుడు కనిపించిన పరిణామాలు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2024 | 07:04 PMLast Updated on: Sep 18, 2024 | 7:04 PM

8 రోజులు 5 ప్లాన్లు బోట్లన

5 ప్లాన్‌లు.. 8 రోజులు.. పదుల మంది అధికారులు.. వందల మంది కార్మికలు.. వేల అనుమానాలు.. లక్షల మంది ఉత్కంఠ.. ఇదీ ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తీస్తున్నప్పుడు కనిపించిన పరిణామాలు.. 8రోజులు 5రకాల ప్లాన్లు వేస్తే.. తప్ప బోట్లను బయటకు తీసే మార్గం కనిపించలేదు. ఈ ఎనిమిది రోజుల్లో అధికారులకు ఎదురైన పరిణామాలు.. కృష్ణమ్మ విరిసిన సవాళ్లు.. ఇదంతా కలిసి ఓ సినిమా తీసేంత సరుకు సిద్ధంగా ఉంది. దాదాపు 40 టన్నుల బరువున్న భారీ బోటును బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో బెకెం ఇన్ఫ్రా ఇంజినీర్లు భారీ బోటును ఒడ్డుకు చేర్చారు. ఎనిమిది రోజులుగా గేట్ల దగ్గరే బోట్ల తొలగింపులో మొదటి ప్లాన్ ఫెయిల్‌ అయింది. రెండో ప్లాన్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మూడో ప్లాన్ అయితే చేశారు కానీ.. దాన్ని అప్లయ్ చేసేంత సీన్ లేకుండా పోయింది. చివరికి అబ్బులు టీమ్‌ కూడా.. తమ వల్ల కాదని చేతులెత్తేసింది. అప్పుడే సరికొత్త ప్రణాళికతో ఎంట్రీ ఇచ్చింది బెకెం ఇన్‌ఫ్రా సంస్థ. వాటర్‌ లోడింగ్ విధానంతో ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలికితీత పనుల్లో పురోగతి సాధించింది. ఒక బోటును విజయవంతంగా బయటకు తీసింది. ఆ ఒక్క బోటు.. మునిగిన మిగిలిన మూడు బోట్లకు రూట్ చూపించింది. అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం అయింది. ఎనిమిది రోజుల అధికారుల శ్రమకు ఫలితం దక్కింది. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. 8 రోజుల్లో అధికారులు పడిన కష్టం అంతా ఇంతా కాదు.

మొదటి ప్లాన్‌లో భాగంగా.. 50 టన్నుల బరువును లేపగలిగే సామర్ధ్యం ఉన్న రెండు బాహుబలి క్రేన్లతో ప్రయత్నించారు. ఐనా ఫలితం లేకుండా పోయింది. బోట్లు ఇంచు కూడా కదల్లేదు. ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ కావడంతో.. రెండో ప్లాన్ అమలు చేశారు. స్కూబా డైవింగ్ ద్వారా నీటిలోపలికి వెళ్లి పడవలను ముక్కలు చేసి బయటకు తీయాలని అనుకున్నారు. ఐతే అది కూడా అట్టర్‌ ఫ్లాప్ అయింది. ఇక మూడో ప్లాన్‌లో భాగంగా.. ఎయిర్ బెలూన్లు పెట్టి బోట్లను పైకి లేపాలని చూశారు. మునిగిన బోట్లు చాలా బరువు ఉండటం, వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో.. ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో పడవలను తొలగించడానికి కచ్చులూరు బోటు ప్రమాద సమయంలో పనిచేసిన అబ్బులు టీమ్‌ను రంగంలోకి దింపారు. ఆ టీమ్‌ బోటుకు తాళ్లు వేసి పైకి లాగారు. పడవ కొంతమేర పైకి వచ్చి మళ్లీ మునిగింది. దీంతో తమ ప్రయత్నాలను విరమించుకుంది అబ్బులు టీమ్‌. ఐతే చివరగా.. బోట్లను వెలికితీయడానికి సరికొత్త ప్రణాళికను అమలు చేశారు బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు. వాటర్ లోడింగ్ విధానం ద్వారా అతి కష్టం మీద ఒక పడవను వెలికితీశారు. వాటర్‌ లోడింగ్ విధానంలో భాగంగా రెండు పడవలకు గడ్డర్లు పెట్టి జాయింట్ చేసి చిక్కుకున్న పడవల దగ్గరికి తీసుకుకెళ్లారు ఇంజినీర్లు. వాటిలో నీటిని నింపి లాక్‌ చేశారు. తర్వాత చైన్‌లతో మునిగిపోయిన పడవను పైకి లాగారు. 40 టన్నులున్న భారీ బోటు ఇసుక, నీరు చేరికతో బోటు 100 టన్నుల బరువు పెరిగింది. తాడులతో నెమ్మదిగా లాగి సక్సెస్‌ ఫుల్‌గా బయటకు తీశారు. పడవ వెలికతీతలో భాగంగా… రెండు భారీ బోట్లకు గడ్డర్లు పెట్టి ఈ ప్రక్రియ చేపట్టారు. రెండింటికి అదనంగా మరో రెండు పడవలతో లాగుతూ చిక్కుకున్న బోటును ఒడ్డుకు చేర్చారు. ఇలా వరుపగా మూడు ప్లాన్‌లు, అబ్బులు టీమ్‌.. నాలుగు ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాక.. ఐదో ప్రయత్నంలో బోటు బయటకు వచ్చింది.