Swarupananda : నువ్వు స్వామీజీవా.. పొలిటికల్ బ్రోకర్‌వా ? హిందువుల పరువు తీసిన స్వరూపానంద

నీచ్ కమిన్ కుత్తేగాళ్లు.. సామాన్యుల్లోనే కాదు. స్వామీజీలు.. బాబాలు లో కూడా పెరిగిపోయారు. విశాఖ శారద పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఈ బాపతు గాడే. హిందూ మతం పేరుతో.. యాగాలు.. పూజలునీ అడ్డం పెట్టుకొని ఏకంగా రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను శాసించాలనుకునే విశాఖ స్వరూపానందేంద్ర కొత్తగా రూటు మార్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 19, 2024 | 12:10 PMLast Updated on: Jun 19, 2024 | 12:10 PM

Are You Swamiji A Political Broker Swarupananda Who Took Away The Honor Of Hindus

 

 

 

ఏ ఎండకి ఆ గొడుగులు పట్టే వ్యక్తులు సామాన్య ప్రజల్లో కనిపించడం సహజం. కానీ.. బంధాలు బంధుత్వాలను కూడా వదిలేసి దైవ చింతనలో బతికే స్వామీజీల్లో కూడా ఇలాంటి క్యాండెట్స్‌ పెరిగిపోతున్నారు. విశాఖ శారద పీఠం (Visakha Sarada Peetham) స్వామి స్వరూపానంద్రేంద్ర (Swaroopanandendra) దీనికి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌. మొన్నటి వరకూ జగన్‌ దైవాంశ సంభూతుడు అన్న రేంజ్‌లో కలరింగ్‌ ఇచ్చిన స్వరూపా.. ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లాగే రివర్స్‌ అయ్యాడు. జగన్‌ను వదిలేసి చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. యాగాల పేరుతో అప్పుడు కేసీఆర్‌ (KCR) ను ముంచేసిన ఇదే స్వామి.. ఇప్పుడు టీడీపీ (TDP) కాంపౌండ్‌లో జెండా పాతేందుకు సిద్ధమవుతున్నాడు.

నీచ్ కమిన్ కుత్తేగాళ్లు.. సామాన్యుల్లోనే కాదు. స్వామీజీలు.. బాబాలు లో కూడా పెరిగిపోయారు. విశాఖ శారద పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఈ బాపతు గాడే. హిందూ మతం పేరుతో.. యాగాలు.. పూజలునీ అడ్డం పెట్టుకొని ఏకంగా రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను శాసించాలనుకునే విశాఖ స్వరూపానందేంద్ర కొత్తగా రూటు మార్చాడు. మొన్నటి వరకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాడో స్వామిగా వ్యవహరించిన ఈ ఫేక్ బాబా.. ఇప్పుడు రూటు మార్చి ఏపీ సీఎం చంద్రబాబు భజన చేస్తున్నాడు. ఎలాగైనా చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

శ్రీకాకుళంలో పుట్టి అక్కడినుంచి విశాఖకు వలస వచ్చి, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఎదురుగా, బాల్ బ్యాట్మెంటన్, టెన్నిస్ రాకెట్లకు నెట్ అల్లే పని చేస్తూ పొట్ట పోసుకునే నరసింహారావు పంతులు హఠాత్తుగా ఒక రోజు విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామి అవతారం ఎత్తాడు. నిజానికి కర్ణాటకలో శృంగేరి దగ్గర శారదా పీఠం అనేది తొమ్మిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు వారు స్వయంగా స్థాపించిన పీఠం. శంకరాచార్యులు స్థాపించిన నాలుగు విశిష్ట పీఠాల్లో ఇది ఒకటి. శృంగేరి శారదా పీఠం హైందవ అద్వైత శాఖకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పీఠం. ఈ పీఠాన్ని అధిరోహించిన వారిని శంకరాచార్యులు గానే పిలుస్తారు.

కానీ.. టెన్నిస్ బ్యాట్లకు నెట్‌లు అల్లుకుంటూ, అల్లరి చిల్లర వేషాలు వేసుకుంటూ తిరిగే నరసింహారావు పంతులు.. హఠాత్తుగా ఓ రోజు విశాఖలోని పెందుర్తిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తన పేరును స్వరూపానంద స్వామిగా చెప్పుకున్నాడు. ఇలా శృంగేరి శారదాపీఠం పేరుని కాపీ కొట్టి.. శంకరాచార్యుల పేరును బ్రష్టు పట్టించడాన్ని ఆక్షేపిస్తూ కర్ణాటక శృంగేరి పీఠం వాళ్లు కోర్టుకెళ్లారు. 1100 ఏళ్ల నాటి తమ పీఠం పేరును స్వరూపానంద కాపీ కొట్టి.. ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నాడని కోర్టుకు నివేదించారు. కానీ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు.. స్వరూపానంద స్వామి అలియాస్ నరసింహారావు పంతులు మొండిగా తాను కృత్రిమంగా సృష్టించిన పీఠాన్ని విశాఖ శారదా పీఠంగా అమల్లోకి తెచ్చాడు. ఆశ్రమం కోసం పెందుర్తిలో ఒక రెండు ఎకరాల చెరువు స్థలాన్ని ఆక్రమించి నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

అక్కడి నుంచి స్వరూపానంద అసలు వేట మొదలైంది. వ్యాపారస్తులు, రాజకీయ వేత్తలు, సెలబ్రిటీలు వీళ్ళని పరిచయం చేసుకుంటూ వాళ్ల ద్వారా ఇంకొన్ని పరిచయాలు పెంచుకుంటూ తనకేమో అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ, యాగాలు యజ్ఞాలు చేస్తూ, చేయిస్తూ పేరు సంపాదించారు. మీడియాలో ఒక వర్గం బ్రాహ్మణుల్ని ఆకట్టుకోవడం ద్వారా ప్రచారం బాగా సంపాదించగలిగాడు. అసలు ఈ నకిలీ స్వామికి మంత్రోచ్ఛరణ రాదు. వేదాలు తెలియదు. జ్ఞాన బోధ అసలే తెలీదు. ప్రతి ఏడాది రిషికేష్ వెళ్లి అక్కడ తపస్సు చేస్తానని, అక్కడ తనకు ఆశ్రమం ఉందని చెప్పుకోవడం తప్ప చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎంతో పురాతనమైన శారదాపీఠం పేరును, కొట్టేసి…. తాను ఒక నకిలీ పీఠం సృష్టించి దానికి పేరు పెట్టి హిందూ మతం పేరిట దళారీ వ్యవస్థకు తెరదీశాడు స్వరూపానంద స్వామి. దేశంలో మిగిలిన అగ్ర పీఠాల వాళ్ళు ఎవరు ఇతని గుర్తించకపోయినా రూటే సెపరేట్ అని చెప్పుకుంటూ రాజకీయ నేతల ప్రాపకంతో వెలిగిపోసాగాడు. ఒక పెద్ద రికమండేషన్ ద్వారా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆకర్షించగలిగాడు ఈ ఫేక్ బాబా. కెసిఆర్‌కు ఉన్న యజ్ఞాలు, యాగాలు పిచ్చని క్యాష్ చేసుకొని రాజశ్యామల యాగం చేయించాడు. అంతేకాదు హైదరాబాద్ కోకాపేటలో వందల కోట్ల విలువైన భూమిని శారదా పీఠం కోసం ప్రభుత్వం నుంచి ఫ్రీగా కొట్టేశాడు స్వరూపానంద స్వామి.

అదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా పట్టుకున్నాడు. క్రిస్టియన్ అయిన జగన్ , హిందువుల ఓట్ల కోసం తనకు ఒక హిందూ స్వామీజీ కావాలి కనుక బ్రోకర్ స్వామిగా పేరు పడిన స్వరూపానందను ఆశ్రయించాడు. జగన్ చేత రకరకాల యాగాలు యజ్ఞాలు జయించాడు స్వరూపానంద. అదృష్టం కలిసొచ్చి జగన్ ముఖ్యమంత్రి కాగానే.. తన వలనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని ప్రచారం చేసుకున్నాడు. జగన్ కూడా తనకు ఒక హిందూ స్వామీజీ కావాలి కనుక, సహజంగా ఉన్నత పీఠాధిపతులు ఎవరు జగన్ చెంత చేరరు గనుక సుఖ స్వామీజీని పక్కన పెట్టుకున్నాడు. అక్కడి నుంచి స్వరూపానంద అసలు గేమ్ మొదలైంది. విశాఖ శారదా పీఠం రాష్ట్ర రాజకీయాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో స్వరూపానంద జోక్యం ఎక్కువైంది. తన భక్తుడు ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజు కు స్వరూపానంద జగన్‌కు చెప్పి మంత్రి పదవి ఇప్పించ్చాడు. దాంతో వైసీపీ నాయకులు అంతా డబ్బు కట్టలు పట్టుకొని విశాఖ శారదా పీఠానికి లైన్ కట్టారు. జగన్ అండ చూసుకొని స్వరూపానంద తిరుమలపై కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టా డు.

ఆంధ్ర తెలంగాణలో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ అక్రమాలతో వేల కోట్ల రూపాయలు దోచేసి, వేల మంది మధ్యతరగతి జనాన్ని రోడ్డున పడేసిన పరమ నీచుడు, దుర్మార్గుడు బూదాటి లక్ష్మీనారాయణ.. స్వరూపానందకు అత్యంత ప్రియ శిష్యుడు. అంతేకాదు విశాఖ శారదా పీఠం ట్రస్టులో కీలక సభ్యుడు కూడా. వేల మంది పొట్ట కొట్టి, కోట్ల రూపాయలు దోచుకున్న ఈ సంస్థ చైర్మన్ బూదాటి లక్ష్మీనారాయణకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా పోస్ట్ ఇప్పించాడు స్వరూపానంద స్వామి. దీన్నిబట్టి ఈ బ్రోకర్ స్వామి ఎంత దరిద్రుడో అర్థమవుతుంది. కేవలం హిందూ ముద్ర కోసం ఈ నకిలీ స్వామీజీని పెట్టుకొని జగన్ చేసిన అరాచకాలుకు ఉదాహరణ లక్ష్మీనారాయణ లాంటి క్రిమినల్‌ను టీటీడీలో సభ్యునిగా నియమించడమే. ప్రీ లాంచ్ స్కాం బయటపడడంతో లక్ష్మీనారాయణ అరెస్టు అయ్యాడు. ఈడీ కేసు కూడా నమోదైంది. దీంతో అతన్ని టిటిడి బోర్డు నుంచి తొలగించారు. లక్ష్మీనారాయణ లాంటి క్రిమినల్‌ని టీటీడీకి రికమెండ్‌ చేయడం తప్పేనని స్వరూపానంద ఒక్కసారి కూడా చెప్పలేదు. ఒక స్వామీజీ ఇలా మంత్రి పదవులు ఇప్పించడం, బోర్డు మెంబర్లను నియమించడం, ప్రభుత్వాల దగ్గర ఆశ్రమాలు పేరుతో ప్రజల భూమిని కొట్టేయడం ఒకటి కాదు స్వరూపానంద అరాచకాలు.. చాలా ఉన్నాయి.

పక్కా వీధి రౌడీలా మాట్లాడే స్వరూపానంద జగన్, వై.వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి అండ చూసుకొని చెలరేగిపోయాడు. ప్రభుత్వ ఖర్చులతో తనకి ఇష్టం వచ్చినట్లు యాగాలు యజ్ఞాలు పేరిట కోట్లు దోచేశాడు. తన వారసుడిగా స్వాత్వానంద స్వామినీ ప్రకటించడం వెనక కూడా పెద్ద కుట్రే ఉందని అనుమానిస్తుంటారు స్థానికులు. హైదరాబాదులో కోకాపేటలో కోట్ల విలువైన భూమిని స్వామీజీకి కేటాయించడంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ కూడా ఉంది. మొత్తం మీద స్వయం ప్రకటిత విశాఖ పీఠం స్వరూపానంద పాపం పండింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అండ చూసుకొని చెలరేగిపోయాడు, చివరికి సీఎంలు ఇద్దరు అడ్రస్ లేకుండా పోయారు. జనం వాళ్ళను దారుణంగా ఓడించారు. స్వరూపానంద యజ్ఞాలు, యాగాలు అవినీతిమయమైన సీఎంలు ఇద్దరినీ కాపాడలేకపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారగానే ఒక్కసారిగా స్వరూపానంద ప్లేట్ మార్చేసాడు. ఒకప్పుడు జగన్ తన ఆత్మ అని చెప్పుకున్న స్వరూపానంద.. ఇప్పుడు హఠాత్తుగా కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు భజన చేయడం మొదలుపెట్టాడు. స్వరూపానంద లాంటి పగటి వేషగాలను నమ్మొద్దని, అతని ఆశ్రమ వ్యవహారాలపై ఎంక్వైరీ కమిషన్ వేసి దర్యాప్తు చేయించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.

అసలు స్వామీజీలకు, బాబాలకు ప్రభుత్వాలతో, రాజకీయ పార్టీలతో ఏమిటి సంబంధం? మతాన్ని అడ్డం పెట్టుకుని.. లీడర్లను, పార్టీలను, ప్రభుత్వ వ్యవస్థలను శాసించాలనుకునే స్వామీజీలను ఎందుకు ఉపేక్షించాలి? ఇది చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఒకప్పుడు సత్య సాయి బాబా, చిన్న జీయర్ స్వామి, ఇప్పుడు విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర. ఇలా చాలామంది ప్రభుత్వ వ్యవస్థల్లో దూరిపోయి వాటిని శాసించాలని ఆత్రుత పడుతుంటారు. లీడర్లు కూడా మూఢనమ్మకాలు కొద్దీ వీళ్లకు సాష్టాంగ పడి వ్యవస్థల్ని వీరికి దాసోహం చేస్తూ ఉంటారు. కెసిఆర్, జగన్ లాంటి నాయకులను అడ్డం పెట్టుకొని విశాఖ స్వరూపానందేంద్ర స్వామి లాంటివాళ్ళు సమాంతర వ్యవస్థలను నడిపించారు. స్వామీజీని నమ్ముకుని ఇద్దరు ముఖ్యమంత్రులు పదవులను పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా జనం ఇలాంటి వాళ్ళని తరిమి కొడితే తప్ప వ్యవస్థలు బాగుపడవు.