YSRCP : వైసీపీ 4లిస్ట్‌పై వీడని సస్పెన్స్‌..

వైసీపీలో (YCP) థర్డ్‌లిస్ట్‌ వచ్చినా.. ఇంకా సీట్ల పంచాయితీ (Panchayat) కొలిక్కిరాలేదు. మూడు జాబితాల్లో 59మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను వైసీపీ హైకమాండ్ మార్చింది. కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ వచ్చినా మరికొన్ని సీట్లపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో నాలుగోజాబితా ఎప్పుడన్న ఉత్కంఠ నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 15, 2024 | 05:45 PMLast Updated on: Jan 15, 2024 | 5:45 PM

During The Ap Assembly Elections The Ruling Party Ycps 4 List Is Full Of Excitement

వైసీపీలో (YCP) థర్డ్‌లిస్ట్‌ వచ్చినా.. ఇంకా సీట్ల పంచాయితీ (Panchayat) కొలిక్కిరాలేదు. మూడు జాబితాల్లో 59మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను వైసీపీ హైకమాండ్ మార్చింది. కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ వచ్చినా మరికొన్ని సీట్లపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో నాలుగోజాబితా ఎప్పుడన్న ఉత్కంఠ నెలకొంది. కొన్నిసీట్లలో క్లారిటీ వచ్చినప్పటికీ మిగిలిన వాటి లెక్కలకోసం వాటినీ ఆపాల్సి వచ్చిందంటున్నారు. నర్సరావుపేట ఎంపీ (Narsaraopet MP) లావు శ్రీకృష్ణదేవరాయులును.. గుంటూరుకు మార్చాలని పార్టీ హైకమాండ్ భావించింది. ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ భావిస్తోంది. అయితే ఎంపీ మాత్రం గుంటూరు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఓ దశలో లావు పార్టీ మారతారన్న ప్రచారం కూడా సాగింది. పల్నాడు (Palnadu) ప్రాంత ఎమ్మెల్యేలు కూడా లావునే కొనసాగించాలని పార్టీ హైకమాండ్‌ను కోరారు.

దీంతో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిని రేపుతోంది. లావును కొనసాగిస్తే గుంటూరు నుంచి ఎవరిని బరిలోకి దింపుతారన్నది చూడాల్సి ఉంది. ఒంగోలులో ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరోసారి బరిలోకి దిగడంపై క్లారిటీ మిస్ అవుతోంది. ఆయనకు పార్టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరిగినా.. మళ్లీ సందిగ్ధత కొనసాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిని ఒంగోలు నుంచి వైసీపీ బరిలోకి దించుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మాగుంటకు సీటుకోసం.. మాజీ మంత్రి బాలినేని గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందనే చర్చ నడుస్తోంది. ఇక బాలినేని.. ఒంగోలు అసెంబ్లీ నుంచే బరిలో ఉంటానని చెప్తున్నా.. దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఆయన గిద్దలూరు వెళతారన్న ప్రచారం కూడా పార్టీలో సాగుతోంది.

ఇక అనకాపల్లి, అమలాపురం, నర్సాపురం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాజమండ్రి, కాకినాడ ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలుగా నియమించారు. మరి వీరి స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఆసక్తి ఉంది. విజయనగరం ఎంపీగా మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను ఎక్కడ సర్దుబాటు చేయాలన్నదానిపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే బెల్లాను పిలిచి మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్. బొత్స భార్య బొత్స ఝాన్సీ ఈసారి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు.

తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి మరోసారి సీటు లేదంటున్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి అక్కడ ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనన్న సస్పెన్స్‌.. పార్టీ కేడర్‌లో కొనసాగుతోంది. కావలి, చోడవరంలోనూ మార్పు ఉంటుందని చెప్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ భవితవ్యం కూడా ఆసక్తిని రేపుతోంది. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లికి మలసాల భరత్‌కుమార్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. మంత్రిని పెందుర్తి పంపుతారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని.. జాగ్రత్తగా పనిచేసుకోవాలని పార్టీ సూచించినట్లు చెప్తున్నారు. దీంతో మంత్రిని ఎటు పంపుతారన్నది కూడా చూడాల్సి ఉంది.