Pawan Kalyan : తన ఓటు తనకే ఏసుకోని పవన్ కల్యాణ్…

ఏపీలో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల హడవిడి.. ఉదయం నుంచి క్యూలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 13, 2024 | 12:39 PMLast Updated on: May 13, 2024 | 12:41 PM

Pawan Kalyan Candidate Of Jana Sena Chief Pithapuram Who Did Not Keep His Vote

ఏపీలో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల హడవిడి.. ఉదయం నుంచి క్యూలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇక మంగళగిరి బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సతీసమేతంగా మంగళగిరి చేరుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రంలో భార్య అన్నా లెజినోవాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా ఈ సంవత్సరం మూడు పార్టీల కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో పవన్ ప్రస్తుత ఓటు హక్కు మంగళగిరి లో ఉనందును పిఠాపురం లో తన ఓటు తనకే వేయలేకపోయారు.

Suresh SSM