CM Chandrababu : నేడు ఏపీ సీఎం చంద్రబాబు 3 జిల్లాల్లో సూడిగాలి పర్యటన..

ఏపీలో ఏన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, సీఎం హోదాలో వరుసగా జిల్లాల పర్యటనకు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజి బిజిగా గడుపుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 11, 2024 | 12:00 PMLast Updated on: Jul 11, 2024 | 12:00 PM

Today Ap Cm Chandrababu Is On A Whirlwind Tour Of 3 Districts

 

 

 

ఏపీలో NDA కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, సీఎం హోదాలో వరుసగా జిల్లాల పర్యటనకు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజి బిజిగా గడుపుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఉదయం పదింటికి వైజాగ్ చేరుకుని అనకాపల్లి జిల్లాలో పోలవరం ఎడమ కాలువ పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం సీఐఐ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. వైజాగ్‌లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు.

మరో వైపు ఏన్డీఏ మద్దతు కేంద్ర ఉక్కు పరిశ్రమల మంత్రి కుమార స్వామి నేడు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఒకే రోజు విశాఖ నగరంలో… ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటనలు జరుగుతున్నడంతో ఏపీ ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు.