వైసీపీ కోసం 16మంది IPSలు ఏం చేశారంటే.. మెమో జారీకి అసలు కారణం ఇదే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 15, 2024 | 05:01 PMLast Updated on: Aug 15, 2024 | 5:02 PM

Why Ap Dgp Send Notices To Those 16 Ips Officers

వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన, వ్యవహరిస్తున్న ఐపీఎస్‌లతో ఓ ఆట ఆడుకుంటోంది చంద్రబాబు సర్కార్‌. వైసీపీ హయాంలో కీలకంగా ఉండి.. జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన 16మంది ఐపీఎస్‌లను వెయిటింగ్‌లో పెట్టిన చంద్రబాబు సర్కార్‌.. ఇప్పుడు వాళ్లకు మెమోలు జారీ చేసింది. ఆ అధికారులంతా.. రోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ అటెండెన్స్ రిజస్టర్‌లో సంతకాలు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పనిగంటలు ముగిసేవరకూ కార్యాలయంలోనే ఉండాలని.. ఆ తర్వాత మళ్లీ సంతకం చేశాకే బయటకు వెళ్లాలని సూచించారు. నిబంధనల ప్రకారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ దాటి వెళ్లకూడదని కాస్త గట్టిగానే చెప్పారు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, పీవీ సునీల్‌కుమార్, ఎన్‌.సంజయ్, కాంతి రాణా తాతా, జి.పాలరాజు, కొల్లి రఘురామ్‌రెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్‌ గున్నీ, అన్బురాజన్, రవిశంకర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డితో పాటు జాషువ, కృష్ణకాంత్‌ పటేల్‌.. ఈ మెమో అందుకున్న అధికారుల్లో ఉన్నారు. ఐతే ఐపీఎస్‌లకు మెమోలు జారీ వెనక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఈ మధ్య కొన్ని కేసుల్లో విచారణకు ఆదేశించింది. ఐతే వాటిని నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేసినట్లు రాష్ట్ర ఇంటిలిజెన్స్ విభాగం గుర్తించిందని తెలుస్తోంది. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు డీజీపీ కార్యాలయం గుర్తించారని సమాచారం. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో.. వెంటనే డీజీపీ కార్యాలయం అలర్ట్ అయిందని.. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేసిందని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసుల్లో.. తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా దర్యాప్తు చేయాలని.. ఆ కేసులపై విచారణ చేస్తున్న అధికారులు, సిబ్బందికి… వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లు సూచనలు చేసినట్లు ఇంటిలిజెన్స్ గుర్తించనట్లు తెలుస్తోంది. ఈ కేసుల్ని తూతూ మంత్రంగా విచారణ ముగించాలని… వెయింటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లు సూచించినట్లు సమాచారం. వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌ల తీరుతో ప్రభుత్వ పెద్దలు కూడా షాకయ్యారట. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ల్లో కొందరు ఇప్పటికీ.. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు గుర్తించారట. ఈ కేసుల దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందట. అందుకే వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారులు రోజూ వచ్చి హెడ్‌ క్వార్టర్స్‌లో సంతకాలు చేసి వెళ్లాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారట.