Home » Author »
తెలంగాణాలో కేబినెట్ విస్తరణ కోసమని ఓ లిస్ట్ తీసుకొని వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఏమైందో ఏమో... కేబినెట్ లేదు... విస్తరణ లేదు... అంతా మీరే రాసుకుంటున్నారు... మీరే చెబతున్నారు. అన్ని శాఖలకీ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది అంటూ ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో తేల్చేశారు రేవంత్ రెడ్డి. దాంతో మంత్రివర్గ విస్తరణపై ఆశ పెట్టుకున్న కాంగ్రెస్ లీడర్లు, BRS జంపింగ్ జపాంగ్స్ డీలా పడ్డారు.
వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగాడు... జగన్ తర్వాత విజయ్ సాయి రెడ్డే నెంబర్ 2. ఏపీలో వైసీపీ ఓడిపోయి... 11 సీట్లకు పడిపోయింది... విజయ్ సాయి ఎంపీగా పోటీ చేసిన నెల్లూరులోనూ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడారు. అప్పటి నుంచి ఆయన ఏపీలో కనిపించడం లేదు
సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణుస్వామి... ఇప్పుడు తన జాతకం చూపించుకోడానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలేమో. BRS గెలుస్తుందనీ, IPL లో సనర్ రైజర్స్ ఓడిపోతుందనీ... ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేపడతాడనీ రకరకాలుగా జాతకాలు చెప్పి... అన్నింట్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇంక జ్యోతిష్యం ఆపు నాయనా... అబద్దాలతో ఎన్నాళ్ళు బతుకుతావ్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
కల్కి మూవీ కొత్త రికార్డు క్రియట్ చేస్తోంది. వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ.. ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ యాక్టింగ్.. నాగి స్టోరీ టెల్లింగ్కు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు
సభలకు లక్షల్లో జనాలు.. బస్సు వెనక పరిగెత్తుకు వచ్చిన అభిమానులు.. సోషల్ మీడియాలో అనుకూలంగా వీడియోలు.. వీటన్నింటి మధ్యలో వైనాట్ 175 అని నినాదాలు.. కట్ చేస్తే 11 సీట్లకు పరిమితం. ఇదీ ఈ ఎన్నికల్లో వైసీపీ, జగన్ ప్రయాణం. సోషల్ మీడియా జోరు మాత్రమే చూసి నమ్మకం పెంచుకున్నారో.. తను మంచి చేశానని జనం అనుకున్నారని అతి విశ్వాసానికి పోయారో కానీ.. ఫలితాల ముందు వరకు జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్తో కనిపించారు.
ఒకప్పుడు ఫ్రీ అన్నాడు... ఆ తర్వాత మిగతా సర్వీస్ ప్రొవైడర్ల కన్నా తక్కువ రేట్లకు జనాన్ని ఆకర్షించారు. ఇప్పుడేమో 27శాతం ఛార్జీల బాదుడు. జియో మొబైల్ రీఛార్జీలు అమాంతం పెరిగిపోతున్నాయి. జులై 3 నుంచి కొత్త టారిఫ్స్ మోత మోగిపోతోంది. జనం ఆదరణ పొందిన కొన్ని ప్లాన్స్ ని పూర్తిగా ఎత్తేశారు. ఓ వైపు అనంత్ అంబానీ పెళ్ళికి కోట్లు కోట్లు ఖర్చుపెడుతున్న ముఖేష్... ఆ ఖర్చును మా దగ్గర వసూలు చేస్తున్నావా అని నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. స్వామి వారి దర్శనం, కల్యాణం, ప్రసాదాలకు అడ్డగోలుగా టిక్కెట్లు పెంచేశారు. అన్యమత ప్రచారం కూడా యధేచ్ఛగా జరిగింది. ఇప్పుడు కొత్తగా దర్శనాల స్కామ్ బయటపడింది.
స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఇప్పటికే డిసైడ్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు... డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అయ్యన్నపాత్రుడిని స్పీకర్ గా పెట్టడం వెనుక బాబు స్కెచ్ మామూలుగా లేదన్న టాక్ నడుస్తోంది.
ఒకప్పుడు చంద్రబాబు మెథడ్ నే ఇప్పుడు జగన్ కూడా ఫాలో అవుతున్నారు. తమ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపాలని డిసైడ్ అయ్యారు. ఏడుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు... ఢిల్లీ బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.
విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ పై టీడీపీ ప్రభుత్వం ప్లాన్ బూమరాంగ్ అయింది. గంటా శ్రీనివాసరావు అత్యుత్సాహంతో ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. వైసీపీని ఇబ్బంది పెట్టాలనుకుంటే... అది టీడీపీకే దెబ్బతగిలింది.