BIGG BOSS7: బిగ్‌బాస్ షో ఫ్యాన్స్ గొడవ.. ఇద్దరు అరెస్టు..

పల్లవి ప్రశాంత్.. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత కారులో ర్యాలీ తీశాడు. ర్యాలీగా వెళ్లిన తర్వాత మళ్లీ రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తీసుకొచ్చారు. దీనికి కారణమైన ఇద్దరు కారు డ్రైవర్లను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2023 | 08:05 PMLast Updated on: Dec 19, 2023 | 8:05 PM

Bigg Boss 7 Newsence Police Arrested Two Persons In The Case

BIGG BOSS7: బిగ్‌బాస్ సీజన్ 7 ఫినాలే సందర్భంగా ఆదివారం ఘర్షణలు, ఉద్రిక్తత తలెత్తిన సంగతి తెలిసిందే. సీజన్ విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ర్యాలీ సందర్భంగా కూడా గొడవ తలెత్తింది. పల్లవి ప్రశాంత్.. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత కారులో ర్యాలీ తీశాడు. ర్యాలీగా వెళ్లిన తర్వాత మళ్లీ రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తీసుకొచ్చారు.

PRABHAS: స్పిరిట్ మూవీకోసం ముహూర్తం ఖరారు చేసిన సందీప్..

దీనికి కారణమైన ఇద్దరు కారు డ్రైవర్లను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు నిందితుల్లో సాయి కిరణ్ ఏ4గా, రాజు ఏ5గా ఉన్నారు. ర్యాలీ తీస్తూ.. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ప్రశాంత్ అదేశాలతో రోడ్డుమీద కార్లను అపడంతో అభిమానులు రెచ్చిపోయారు. దాంతో కేసులో వారిని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. బిగ్‌బాస్ విజేత ర్యాలీ సందర్భంగా ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. బిగ్‌బాస్ సెలబ్రిటీల కార్లతోపాటు, గీతూ రాయల్ కార్లను కొందరు అభిమానులు ధ్వంసం చేశారు. అలాగే ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేయడంపై ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆనాటి ఘటనలపై పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.