BIHAR MURDER: బిజీగా ఉంటోందని భార్యని చంపేశాడు..

బిహార్‌లోని పాట్నాలో ఉండే గజేంద్రయాదవ్‌, శోభాకుమారి భార్యాభర్తలు. శోభాకుమారికి రీసెంట్‌గానే పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. శోభా వర్క్‌ బిజీలో ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త కంటే డ్యూటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదట శోభ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2023 | 06:59 PMLast Updated on: Oct 23, 2023 | 6:59 PM

Husband Kills Woman Cop For Neglecting Homely Duties

BIHAR MURDER: భార్యభర్తలు అంటేనే ఒకరికోసం ఒకరు బతకాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకరి బిజీ టైమ్‌కు మరొకరు గౌరవం ఇచ్చుకోవాలి. అలా ఉన్నప్పుడే ఆ కాపురం సవ్యంగా, సంతోషంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా గొడవలు, కొట్లాటలే. అవి కూడా నార్మల్‌గా ఉంటే ఒకే.. కానీ ఇలా హద్దు మీరితేనే ప్రాబ్లం. పాట్నాలోని ఓ దంపతుల విషయంలో ఇదే జరిగింది. చిన్నగా స్టార్ట్‌ అయిన ఈ వ్యవహారం ప్రాణం తీసుకునేవరకూ వెళ్లింది.

బిహార్‌లోని పాట్నాలో ఉండే గజేంద్రయాదవ్‌, శోభాకుమారి భార్యాభర్తలు. శోభాకుమారికి రీసెంట్‌గానే పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. శోభా వర్క్‌ బిజీలో ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త కంటే డ్యూటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదట శోభ. ఈ విషయం గజేంద్రకు నచ్చేది కాదు. ఇంటికి, తనకు కూడా కాస్త సమయం ఇవ్వాలంటూ భార్యతో గొడవ పడేవాడట. చాలా కాలం పాటు ఇద్దరి మధ్య ఇదే తంతు. రీసెంట్‌గా మరోసారి ఇదే జరగడంతో గజేంద్ర.. తన భార్యపై ఎక్కడ లేని కోపం పెంచుకున్నాడు. తనకు టైం ఇవ్వలేని భార్య ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనుకున్నాడు కావొచ్చు. శోభను చంపేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఓ ప్లాన్‌ ప్రకారం హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేశాడు.

మాట్లాడే పని ఉంది.. ఇంట్లో కాకుండా బయట కలుద్దామని చెప్పి భార్యను పిలిచాడు. రూంలో మరోసారి జాబ్‌ విషయంలో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్‌ అయ్యింది. అప్పటికే గన్‌తో వచ్చిన గజేంద్ర భార్యను షూట్‌ చేశాడు. దీంతో ఆమె అక్కడే చనిపోయింది. ప్రస్తుతం గజేంద్ర పోలీసుల అదుపులో ఉన్నాడు. జాబ్ వల్ల భార్య బిజీగా ఉంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ప్రాణం తీసి కిరాతకుడిగా మిగిలిపోయాడు గజేంద్ర.