Kukatpalli: ప్రియుడితో కలిసి భర్తకు నిప్పుపెట్టి లేపేసిన భార్య.. కూకట్‌పల్లి జిమ్‌ ట్రైనర్‌ కేసులో సంచలన నిజాలు

వివాహేతర సంబంధాల కింద పడి.. బంధాలు నలిగిపోతున్నాయ్.. కలియుగం సార్ ఇది ! మూడు ముళ్లు, ఏడడుగులు నడిచి.. వందేళ్లు కలిసి ఉంటామని ప్రమాణం చేసుకొని.. సంసారం కొన్నేళ్లు తిరిగేసరికి ప్రాణాలు తీస్తున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయ్ ఈ మధ్య ! వివాహేతర సంబంధాల మాయలో పడి.. కట్టుకున్న భర్తనే కడతేరుస్తున్న ఘోరాలు వరుసగా వెలుగుచూస్తున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 19, 2023 | 07:06 PMLast Updated on: May 20, 2023 | 11:34 AM

Kukatpalli Unmarrital Relation Case

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అలాంటి దారుణమే జరిగింది. ప్రియుడితో కలిసి భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి.. సజీవ దహనం చేసిన ఘటన.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేస్తోంది. కూకట్‌పల్లి ప్రసన్న నగర్‌లో.. వారం రోజుల కింద ఓ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జయక్రిష్ణ అనే జిమ్‌ ట్రైనర్ చనిపోయాడు. మొదట్లో అంతా ప్రమాదమే అనుకున్నారు దీన్ని ! ఆత్మహత్య కోణంలోనే దర్యాప్తు చేశారు. ఐతే అసలు నిజాలు తెలిసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. పోలీసు విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయ్.

ఇది ప్రమాదమో, ఆత్మహత్యో కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని తేలింది. ప్రియుడితో కలిసి భర్త జయక్రిష్ణను హత్య చేసిన భార్య.. ఆ తర్వాత ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. చిన్నా అనే వ్యక్తితో జయకృష్ణ భార్య.. ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ సంగతి తెలుసుకున్న జయకృష్ణ.. కుటుంబాన్ని హైదరాబాద్‌ నుంచి షిప్ట్‌ చేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో తమ బంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా తొలగించాలని ప్లాన్‌ వేసిన భార్య… ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేసింది. భర్త అడ్డు తొలగించుకుంటే ఇద్దరు కలిసి ఉండొచ్చని హత్యకు ప్లాన్ చేసింది. భర్తకు చిన్నాతో కలిసి ఫుల్‌గా మద్యం తాగించింది. జయకృష్ణ మత్తులోకి జారుకోగానే ప్రియుడి సాయంతో పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. పైగా ఆత్మహత్యగా సీన్ క్రియేట్ చేసింది.