Live Murder: మంచిర్యాల మర్డర్‌ కేసులో కొత్తట్విస్ట్‌

మంచిర్యాల లైవ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు తెలుస్తున్నాయ్. మహేష్, నిందితురాలైన యువతి మధ్య ఫోన్ వీడియో కాల్స్ బయటికి వచ్చాయ్. ఆ వీడియో కాల్స్ చూస్తే.. పెళ్లి జరిగిన తర్వాత కూడా మహేశ్, యువతి మధ్య ప్రేమ కొనసాగినట్లుగా తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2023 | 07:15 PMLast Updated on: Apr 26, 2023 | 7:15 PM

Live Murder Case In New Twist

తనను తన భర్త నుంచి దూరం చేయాలని మహేష్‌ను వేడుకున్న యువతి వీడియో కలకలం రేపుతోంది. హత్యకు ముందే మహేష్‌తో వివాహిత వీడియో కాల్స్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు కేసులో కీలకంగా మారాయ్.. పోలీసులు ఈ వీడియోలను పరిశీలించి వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వివాహితను వేధించడం, అసభ్యకరమైన సందేశాలు పంపడం వల్లే మహేశ్‌ను యువతి కుటుంబసభ్యులు హత్య చేశారని వార్తలు వచ్చాయ్. ఐతే ఈ వీడియోలను చూస్తుంటే మహేష్ వివాహితను వేధించలేదని తెలుస్తోంది. వివాహిత కుటుంబసభ్యులు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తేల్చాలని మహేష్ కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులను కోరుతున్నారు.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో మహేష్‌ దారుణహత్యకు గురయ్యాడు. యువతి కుటుంబసభ్యులు నలుగురు కలిసి రాళ్లతో కొట్టి, అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై గొంతుకోసి మహేష్‌ను హత్య చేశారు. యువకుడి హత్యపై అనేక వార్తలు వినిపించాయ్. వివాహితను వేధించడంతో కుటుంబసభ్యులు హత్య చేశారని ప్రచారం జరిగింది. యువతిని మహేష్‌ ప్రేమించగా.. ఆమెకు మరో యువకుడితో పెళ్లి జరిగింది. ఈ కోపంతో తాము ప్రేమించుకున్న సమయంలోని సన్నిహిత వీడియోలు, ఫొటోలను.. యువతి భర్తకు పంపించాడు మహేష్‌. దీంతో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి యువతి కుటుంబసభ్యులు మహేష్‌పై ద్వేషం పెంచుకున్నారని ప్రచారం జరిగింది. యువతిని కలిసేందుకు మహేష్ వచ్చిన సమయంలో.. అడ్డుకొని దాడి చేశారని ముందు వినిపించింది. ఐతే ఇప్పుడు లీక్ అయిన వీడియా కాల్ రికార్డులు.. కేసును కొత్త మలుపు తిప్పాయ్‌.