కోల్‌కతా డాక్టర్ కేసు.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 13, 2024 | 08:24 PMLast Updated on: Aug 13, 2024 | 8:24 PM

Shocking News Over Calcutta Doctors Rape Murder

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్‌. అత్యాచారానికి తెగబడిన దుర్మార్గుడు.. కళ్లు, గోళ్లు, మెడతో పాటు జననాంగాలపై గాయాలు చేసి.. అతి కిరాతకంగా ఆ డాక్టర్‌ ప్రాణాలు తీశాడు. ఉక్కిరిబిక్కిరి చేసి, గొంతు నులిమి చంపేయడంతో థైరాయిడ్ మృదులాస్థి విరిగిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న బాధితురాలు.. తన సహచరులతో కలిసి ఒలింపిక్స్‌ చూసింది. నీరజ్ చోప్రా మ్యాచ్ ముగిసిన తర్వాత తోటి వైద్యులతో కలిసి డిన్నర్ పూర్తిచేసి.. సెమినార్ హాల్‌లో రెస్ట్ తీసుకుంటానని చెప్పి వెళ్లింది. అదే ఆమె పాలిట యమపాశమైంది. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. ఆమెను హత్య చేసినట్టు పోస్ట్‌మార్టమ్ నివేదిక తెలిపింది. బాధితురాలి బొడ్డు, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు గుర్తులు ఉన్నాయ్. ఆమె కేకలు వేయకుండా నోరు మూసేసి.. తలను గోడ లేదా నేలకు బలంగా కొట్టినట్టు గుర్తించారు. సహాయం కోసం అరవకుండా బాధితురాలి నోరు, గొంతును నిరంతరం నొక్కి ఉంచారని… కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగిందని నివేదిక వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌‌ను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన ఆర్జీ రాయ్ ఆస్పత్రి దగ్గర ఉండే పోలీస్ ఔట్‌పోస్ట్ దగ్గర నిందితుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. పోర్న్‌కు బానిసైన కామాంధుడు.. హింసాత్మక క్లిప్‌లను చూసేందుకు ఇష్టపడతాడని పోలీసులు చెప్తున్నారు. అతడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు గుర్తించారు. నేరం చేసిన తర్వాత తన బ్యారక్‌కు వెళ్లిన సంజయ్ రాయ్… చాలా గంటలు నిద్రపోయినట్టు తేలింది. మేల్కొన్న తర్వాత నేరాన్ని కప్పిపుచ్చుకోడానికి బట్టలు ఉతికేసి.. షూపై రక్తపు మరకలు తుడిచేశాడు. ఘటనా స్థలిలో బ్లూటూత్ హెడ్‌సెట్‌ ఆధారంగా నిందితుడ్ని గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేశారు. ముఖంపై నిందితుడు గోటిగుర్తులను బట్టి.. ఆమె తీవ్రంగానే ప్రతిఘటించినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసు విచారణ చాలా నెమ్మదిగా సాగుతోంది. కోల్‌కతా హైకోర్టు.. ఈ విచారణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఇక అటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. కోల్‌కతావ్యాప్తంగా నిరసనలు కనిపిస్తున్నాయ్.