అల్లు…. మెగా ఓపెన్ వార్…. ఇక దాగుడుమూతలు వద్దమ్మా!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2024 | 04:39 PMLast Updated on: Aug 23, 2024 | 4:39 PM

అల్లు మెగా ఓపెన్ వార్ ఇక

ఎవరు ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని దాగుడుమూతలు ఆడిన అల్లు అర్జున్, చిరంజీవి కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరుగుతుందనేది మరోసారి స్పష్టమైపోయింది. తాను మెగా ఫ్యామిలీ హీరోని కానని, తనకంటూ అల్లు బ్రాండ్ అనేది సెపరేట్గా ఉందని… రోజు చిరంజీవికి వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదని, పవన్ కళ్యాణ్ వెనుక తప్పెటగుళ్ళు కొట్టాల్సిన అవసరం ఇంకా లేదని… తనకిష్టమైనట్టు తన జీవిస్తానని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు అల్లు అర్జున్. ప్రతి వ్యక్తి…. వృత్తిలోనూ జీవితంలోనూ తనకంటూ సొంత ఉనికిని వెతుక్కుంటాడు. వెతుక్కోవాలి కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్నది కూడా అదే. ఈ విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కొణిదల నాగబాబు. అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ఎన్నికల సమయంలో నాగబాబు చేసిన ట్వీట్లు ఆ కుటుంబాల మధ్య మరింత దూరం పెంచాయి. కాదు లేదు అని రెండు కుటుంబాలు ఎన్ని కథలు చెప్పినా… అల్లు అర్జున్‌ మాత్రం తగ్గేదే లే… అంటున్నాడు. తన పాపులర్‌ సినిమా డైలాగ్‌ని ప్రాక్టికల్‌గా కూడా ఆచరించి చూపిస్తున్నాడు. నిజ జీవితంలో కూడా నేనింతే…. నా స్టైల్‌ అదే….తగ్గేదే లేదంటున్నాడు.అదే విషయాన్ని అవతలి వాళ్ళకు డైరెక్ట్‌గా… క్లియర్‌గా అర్ధమయ్యేలా చెబుతున్నాడు.

అల్లు అర్జున్‌ ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి, ఇష్టపడేవాళ్ళ కోసం నిలబడాలి, మనసుకు నచ్చితే వస్తా. ఇదే…. మూడు ముక్కలుగా చెప్పిన ఈ ఒక్క మాటే…. ఇప్పుడు వంద ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఆల్రెడీ ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా సమాధానాలు చెబుతున్నట్టుగా ఉందంటున్నారు అనలిస్ట్‌లు. ఈ మాటలు విన్నవాళ్ళందరికీ ఇప్పుడు అల్లు అర్జున్‌ మెగా కాంపౌండ్‌కి డైరెక్ట్‌ సందేశం పంపారా అన్న డౌట్స్‌ వస్తున్నాయట. మెల్లిగా తెరలు తొలుగుతున్నాయా అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు కొందరు. దీంతో మెగా కాంపౌండ్‌ వర్సెస్‌ అల్లు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. రెండు కుటుంబాల మధ్య పైకి కనిపించని అగాధమేదో పెరిగిపోతోందని చాలా రోజులుగా ఊహాగానాలున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అదే ఇండికేషన్‌ ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల టైంలో అది పీక్స్‌కు చేరి రచ్చ అయింది. నాడు ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న టైంలో అల్లు అర్జున్‌ నంద్యాల టూర్‌పై వంద సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆ ఎన్నికల్లో డూ ఆర్‌ డై అన్నట్టుగా పోరాడాయి వైసీపీ, కూటమి పార్టీలు. అందులోనూ.. ఈసారి వైసీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వబోనని శపథం చేసి తాను ఎక్కడ తగ్గాలో తెలుసుకుని మరీ… చివరికి నెగ్గారు పవన్‌కళ్యాణ్‌. ఆయన పోటీ చేసి గెలిచిన పిఠాపురంలో పలువురు టాలీవుడ్‌, టీవీ నటులు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. పవన్‌ తరపున ప్రచారం చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం గతానికి భిన్నంగా ఈసారి ఓపెనైపోయి పవన్‌కు బాసటగా నిలబడింది.అయితే… అదే టైంలో అల్లు అర్జున్‌ వ్యవహార శైలి మీద రకరకాల సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన పిఠాపురం వైపు చూడలేదు సరే… జనసేన ప్రత్యర్థిగా భావించే వైసీపీ తరపున నంద్యాలలో పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డికి బహిరంగ మద్దతు ప్రకటించారు. పోలింగ్‌కు ముందు ఆయన ఇంటికి వెళ్ళిమరీ హంగామా చేశారు. తనవాళ్ళు ఎక్కడున్నా వెళ్తానని, వాళ్ళ మేలు కోరుకుంటానని అప్పుడు అన్నారు అల్లు అర్జున్‌. అక్కడే అందరికీ డౌట్‌ కొట్టింది. అంటే … పవన్‌కళ్యాణ్‌ ఆ… తనవాళ్ళ లిస్ట్‌లో లేరా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. శిల్పా రవి కోసం నేరుగా ఆయన ఇంటికి వెళ్ళిన అల్లు అర్జున్‌…పవన్‌కు మద్దతుగా కేవలం ఒక ఎక్స్‌ మెస్సేజ్‌తో సరిపెట్టడం ఏంటన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్తం అయ్యాయి. అంటే.. ఇద్దరి మధ్య పైకి కనిపించని అగాధం ఉందా? ఆధిపత్య పోరు నడుస్తోందా అన్న ప్రశ్నలు సైతం వచ్చాయి. దానికి కొనసాగింపుగా నాగబాబు పెట్టిన మరో మెస్సేజ్‌ ఇంకా కాక రేపింది. మేలు కోరే వాడు పరాయివాడైనా మనోడే…. కోరని వాడు మనోడైనా పగోడేనంటూ పెట్టిన మెస్సేజ్‌తో లోలోపల ఏదో జరిగిపోతోందన్న డౌట్స్‌ ఇంకా పెరిగిపోయాయి. తర్వాత నాగబాబు డిలీట్‌ చేసినా జనంలో పెరగాల్సిన డౌట్స్‌ మాత్రం పెరిగిపోయాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎర్ర చందనానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ పుష్ప సినిమాను పరోక్షంగా టార్గెట్ చేస్తూ వదిలిన కామెంట్లు రెండు వర్గాలు, రెండు కుటుంబాలు మధ్య మరింత అగ్గి రాజేశాయి.

ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ అగ్గి అంటుకుంది. డైరెక్టర్‌ సుకుమార్‌ భార్య సమర్పణలో రిలీజ్‌ అవబోతున్న సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తాజా వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్‌. మనసుకు నచ్చితే వస్తా, ఇష్టపడేవాళ్ళ కోసం నిలబడాలి అన్న అల్లు వ్యాఖ్యల చుట్టూనే తిరుగుతోంది చర్చ మొత్తం. నాడు ఎన్నికల టైంలో పవన్‌ పక్కన ఆయన నచ్చకనే నిలబడలేదా? అందుకే మరీ బాగుండదనుకుని మామకు మద్దతుగా జస్ట్‌ ట్వీట్‌ చేసి వదిలేశారా? ఇష్టమైన శిల్పా రవి దగ్గరికి నేరుగా వెళ్ళారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల పవన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వస్తున్నాయి. గతంలో అడవుల్ని కాపాడేవాళ్ళు హీరోలని, ఇప్పుడు సినిమాల్లో హీరోలు అటవీ సంపదను స్మగ్లింగ్‌ చేస్తున్నారని అన్నారాయన. ఆ మాటల వెనక పవన్‌ ఉద్దేశ్యం ఏదైనా…. నేరుగా వెళ్ళి అల్లు అర్జున్‌ సినిమా పుష్పకే తగిలాయి. ఆ మాటల్ని, ఇప్పుడు అల్లు మాటల్ని కలిపి చూస్తే…. అగాధం చాలా లోతుగానే ఉందనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. పవన్‌కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని, మీరు అనవసరంగా ట్రోలింగ్‌ చేయవద్దని ఆ మధ్య అన్నారు నటుడు హైపర్‌ ఆది. మెగా కాంపౌండ్‌కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఆది మాటలతో మేటర్‌ సెటిల్‌ అయిపోయి ఉండవచ్చని అనుకున్నారు అంతా. కానీ… మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట రాజకీయ వర్గాల్లో. అంతేకాదు అల్లు అర్జున్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు నా ఫ్యాన్స్ వేరు, నా ఆర్మీ ఇలాంటి మాటలు వాడుతున్నాడు. మరి ఈ మాటలు ఎలాంటి టర్న్‌ తీసుకుంటాయో, ఇందుకు మెగా కాంపౌండ్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పబ్లిక్. నిజానికి చిరంజీవి, అల్లు ఫ్యామిలీ మధ్య జరిగే ఈ మాటలు యుద్ధం, ట్వీట్ వార్ జనానికి ఎంటర్టైన్మెంట్ తప్ప
ఎవరికి ఏం అవసరం ఉంటుంది?