Chiru 157 : చిరు కోసం ఏకంగా 17 సెట్టింగులా..

మెగాస్టార్‌ (Megastar) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర (Vishwambhara).. సోషియో ఫాంటసీ నేపథ్యం లో విశ్వంభర మూవీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది. బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ మూవీలో భారీ యాక్షన్స సీన్స్‌ ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 29, 2024 | 11:06 AMLast Updated on: Apr 29, 2024 | 11:06 AM

17 Settings At Once For Chiru

 

 

 

మెగాస్టార్‌ (Megastar) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర (Vishwambhara).. సోషియో ఫాంటసీ నేపథ్యం లో విశ్వంభర మూవీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది. బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ మూవీలో భారీ యాక్షన్స సీన్స్‌ ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయంటున్నారు. ఇక.. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం చిరు ఎంతో రిస్క్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌ శివారులోని ఓ చెరువులోకి దిగి ఎలాంటి డూప్‌ లేకుండా ఈ యాక్షన్ సీన్స్ చేసినట్లు వచ్చిన వార్తలు ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో రిచ్‌ లుక్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

విశ్వంభర మూవీ కోసం భారీ సెట్టింగ్స్‌ని వేసినట్లుగా ఇప్పటికే వార్తలు వినిపించాయి. విశ్వంభరలో ఉన్న ఎన్నో క్రేజీ ఎలిమెంట్స్ లో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఒకటని.. ఇంటర్వెల్ యాక్షన్‌ సీక్వెన్స్ ని మేకర్స్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపించింది. ఆల్రెడీ 20 రోజులకి పైగా ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే చిరు కేటాయించినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై మరింత క్లారిటీ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఏకంగా మొత్తం 17 గ్రాండ్ సెట్టింగులు వేసారట. వీటితో దాదాపు సినిమా పూర్తవుతుందని లేటెస్ట్ ఇన్‌ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ చాలా మేర కంప్లీట్ కాగా మిగతా మొత్తం కూడా ఈ జూలై నాటికి పూర్తవుతుంది అని సమాచారం. అక్కడ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మెయిన్ గా వి ఎఫ్ ఎక్స్ ని పూర్తి చేసి.. ఎట్టి పరిస్థితి లో 2025 సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 10న సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సీనియర్ హీరోయిన్ త్రిష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి.. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్‌ వీడియో సినిమా పై మరింత క్యూరియాసిటీ పెంచేసింది.