Akshay Kumar: అఫీషియల్.. అక్షయ్ వచ్చేశాడు.. మరి ప్రభాస్ మాటేంటి

క్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నాడు విష్ణు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఎంట్రీ ఇచ్చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2024 | 02:26 PMLast Updated on: Apr 16, 2024 | 2:26 PM

Akshay Kumar Confirms Telugu Debut With Vishnu Manchus Kannappa

Akshay Kumar: గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న మంచు విష్ణు.. తన కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నాడు విష్ణు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఎంట్రీ ఇచ్చేశాడు.

JANASENA GLASS: జనసేనకే గాజు గ్లాసు.. హైకోర్టులో బిగ్ రిలీఫ్

ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అక్షయ్ రాకతో కన్నప్ప సినిమా బాలీవుడ్ టచ్ ఇస్తుండగా.. ఈ సినిమాతోనే అక్షయ్ కుమార్ తెలుగులోకి అడుగుపెడుతున్నాడు. కన్నప్పలో అక్షయ్ కుమార్‌ శివుడిగా కనిపించనున్నట్టుగా సమాచారం. ముందుగా ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అక్షయ్ ఆ పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో.. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌లో లేనట్టేనా అంటే, కాదనే అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడిగా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. లేదంటే.. అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్ ఏమైనా చేస్తున్నాడా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

కానీ కన్నప్పను మాత్రం ఊహించని స్టార్ క్యాస్టింగ్‌తో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు మంచు విష్ణు. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మంచు విష్ణు, మోహన్ బాబు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు.