Kalki : మరో కల్కి.. ప్రభాస్ రికార్డులు ఖతం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' చేస్తున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 'పుష్ప-2' కోసం అందరూ ఎంతలా ఎదురుచూస్తున్నారో.. దాని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి కూడా అదే స్థాయిలో అందరిలో నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 17, 2024 | 03:47 PMLast Updated on: Jul 17, 2024 | 3:47 PM

Allu Arjun New Project

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప-2’ చేస్తున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ‘పుష్ప-2’ కోసం అందరూ ఎంతలా ఎదురుచూస్తున్నారో.. దాని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి కూడా అదే స్థాయిలో అందరిలో నెలకొంది.

అల్లు అర్జున్ ఇప్పటికే దర్శకులు త్రివిక్రమ్ , సందీప్ రెడ్డి వంగా లతో సినిమాలను ప్రకటించి ఉన్నాడు. అయినప్పటికీ ‘పుష్ప-2’ తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై సస్పెన్స్ నెలకొంది. తమిళ దర్శకుడు అట్లీ సినిమాతో ఉంటుందని ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అట్లీతో పాటు బోయపాటి శ్రీను, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టులేవీ ఫైనల్ కాలేదని.. త్రివిక్రమ్ తోనే బన్నీ నెక్స్ట్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది అంటున్నారు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా వీరి కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు రాగా.. మూడూ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ హ్యాట్రిక్ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది. ఇది ప్రభాస్ ‘కల్కి’ తరహాలో మైథలాజికల్ టచ్ తో, అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రానుందట.

త్రివిక్రమ్ కి పురాణాలపై పట్టు ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అలాంటి త్రివిక్రమ్ మైథలాజికల్ టచ్ తో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అసలే హ్యాట్రిక్ హిట్ కాంబో, దానికి తోడు మైథలాజికల్ టచ్. ఇది చాలదు అన్నట్టు అల్లు అర్జున్ కి ‘పుష్ప-2’ తర్వాతి సినిమా. ఇప్పటికే ‘పుష్ప-2’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టడం ఖాయమనేది ట్రేడ్ వర్గాల మాట. అదే జరిగితే, ‘పుష్ప-2’ తర్వాత వచ్చే బన్నీ-త్రివిక్రమ్ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ మైథలాజికల్ ఫిల్మ్ వర్కౌట్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర ఊహించని సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.