ALLU ARJUN: మూడు జోనర్లలో.. ముగ్గురితో సినిమాకు సై అన్న బన్నీ

బన్నీ ప్రజెంట్ బోయపాటికి, త్రివిక్రమ్‌కి, అలానే ఆట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకేసారి ముగ్గురితో సినిమాలు చేయట్లేదు. కాని, ప్రతీ మూవీకి మూడునెలల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నాడు. పుష్ప 2 ఈజీగా సినీ సునామీ క్రియేట్ చేస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2024 | 06:01 PMLast Updated on: Mar 13, 2024 | 6:01 PM

Allu Arjun Planning Back To Back Movies With Trivikram Boyapati Atlee

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ దేశముదురు. కాని పాన్ ఇండియా లెవల్లో తను ప్రపంచ ముదురుగా మారాడు. కారణం కేవలం ఫుష్ప హిట్ అవ్వడంతోపాటు పుష్ప 2 రాబోతుండటం, ఆ తర్వాత తన కెరీర్ ఎలా ఉండాలో.. తను ఎలా డిజైన్ చేసుకుంటున్నాడో చూస్తే ఎవరైనా తనని ప్రపంచ ముదురు అనకుండా ఉండలేరు. బన్నీ ప్రజెంట్ బోయపాటికి, త్రివిక్రమ్‌కి, అలానే ఆట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

RAM CHARAN: క్లీంకారా కనిపించిందోచ్‌.. వైరల్ అవుతున్న ఫొటోలు..

ఒకేసారి ముగ్గురితో సినిమాలు చేయట్లేదు. కాని, ప్రతీ మూవీకి మూడునెలల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నాడు. పుష్ప 2 ఈజీగా సినీ సునామీ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్ బట్టే అది అంచనా వేయొచ్చు. సో.. ఈ సినిమా తర్వాత బన్నీ ఏ మూవీచేసినా కొత్త జోనర్, కొత్త పాత్ర కాబట్టి, హిట్ మెట్టెక్కడం అంత ఈజీ కాదు. పుష్ప రాజ్ రేంజ్‌లో జనాన్ని ఆకట్టుకోవాలంటే, తనమీద పెరిగే అంచానాలు అందుకోవాలంటే కొత్త సినిమాల్లో కంటెంట్ మతిపోగొట్టేలా ఉండాలి. లేదంటే సీన్ రివర్స్ తప్పదు. అందుకే పుష్పగా మాస్ మతిపోగొట్టిన బన్నీ, త్రివిక్రమ్ మేకింగ్‌లో పాన్ ఇండియా ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేశాడు.

తర్వాత బోయపాటి శీను మేకింగ్‌లో సేఫ్ గేమ్ ఆడేందుకు ఊర మాస్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. ఇక అట్లీ మూవీలో అటు మాస్ ఎలిమెంట్స్, ఇటు యాక్షన్ ధమాకా ఉంటుంది. కాబట్టే ముగ్గురు దర్శకులతో.. మూడు ఫ్లేవర్లలో సినిమాలు చేసి, ఒకటి కాకపోయినా ఇంకొక మూవీతోనైనా పాన్ ఇండియాను మూడో సారి షేక్ చేస్ ప్లాన్ వేశాడు. అది కూడా పుష్ప 2 రాకముందే.