Allu Arjun : మంచు లక్ష్మీని టార్గెట్‌ చేసిన అల్లు అర్జున్‌.. !

స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్‌ తన స్టైల్‌ని పక్కన పెట్టి చేసిన సినిమా ‘పుష్ప’. పక్కా ఊర మాస్‌ క్యారెక్టర్‌లో నటించిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కమర్షియల్‌గా విజయం సాధించడమే కాదు, ఆ సినిమాలో బన్నీ నటనకు నేషనల్‌ అవార్డు కూడా వరించింది. టాలీవుడ్‌లోనే కాదు, మాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న అల్లు అర్జున్‌.. అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2024 | 02:55 PMLast Updated on: Jan 06, 2024 | 2:55 PM

Allu Arjun Targeted Manchu Lakshmi

స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్‌ తన స్టైల్‌ని పక్కన పెట్టి చేసిన సినిమా ‘పుష్ప’. పక్కా ఊర మాస్‌ క్యారెక్టర్‌లో నటించిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కమర్షియల్‌గా విజయం సాధించడమే కాదు, ఆ సినిమాలో బన్నీ నటనకు నేషనల్‌ అవార్డు కూడా వరించింది. టాలీవుడ్‌లోనే కాదు, మాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న అల్లు అర్జున్‌.. అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాడు. సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాలను అందరితోనూ పంచుకుంటాడు. తాజాగా అలాంటి ఒక పోస్ట్‌ అందర్నీ ఆకర్షించింది.

అదేమిటంటే.. విలక్షణ నటి మంచు లక్ష్మీకి అల్లు అర్జున్‌ ఓ ఛాలెంజ్‌ విసిరాడు. నెలరోజులపాటు తాను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంటూ లక్ష్మీకి ఓ స్పెషల్‌ టాస్క్‌ ఇచ్చాడు. దానికి మంచు లక్ష్మీ కూడా పాజిటివ్‌గా స్పందిస్తూ తాను రెడీ అంటూ రిప్లయ్‌ ఇచ్చింది. ఆమె తన ఛాలెంజ్‌ని యాక్సెప్ట్‌ చేసిందన్న విషయాన్ని కూడా బన్ని షేర్‌ చేశాడు. అందులో భాగంగా కొత్త సంవత్సరం నీ గోల్స్‌ ఏమిటి? అనేది పబ్లిక్‌తో షేర్‌ చేసుకోవాలని లక్ష్మీని కోరాడు బన్ని. ఈ సంవత్సరం తన గోల్‌ ఏమిటి? అనే విషయాన్ని తెలియజేస్తూ.. నెల రోజులపాటు రైస్‌కి, నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలని డిసైడ్‌ అయ్యానని చెప్పింది. ఇది చాలా కష్టమైన టాస్క్‌ అని, ఈ రెండూ లేకుండా తాను ఉండలేనని చెప్పింది. అయినా సరే ఈ ఛాలెంజ్‌ని తాను స్వీకరించానని, నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందో చూడాలని లక్ష్మీ అంటోంది. ఆమె పెట్టిన పోస్ట్‌ను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మంచు లక్ష్మీకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు బన్నీ.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్ట్‌ 15న విడుదల కానుంది. మొదటి పార్ట్‌ సాధించిన విజయంతో సెకండ్‌ పార్ట్‌పై విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయింది. మంచు లక్ష్మీ ప్రస్తుతం ‘ఆదిపర్వం’ చిత్రంలో నటిస్తోంది. సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల మంచు లక్ష్మీ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ అయి అందర్నీ ఆకట్టుకుంటోంది.