Arundhati Nair: చావుబతుకుల మధ్య హీరోయిన్‌.. చికిత్సకు డబ్బుల్లేక దారుణ స్థితిలో

సరిగ్గా కోవలం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి వీరి స్కూటీని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రస్తుతం అరుంధతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2024 | 04:43 PMLast Updated on: Mar 20, 2024 | 4:44 PM

Arundhati Nair On Ventilation Support After Bike Accident Fighting For Her Life

Arundhati Nair: ప్రముఖ త‌మిళ, మ‌ల‌యాళ న‌టి అరుంధ‌తి నాయ‌ర్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దీంతో చావు బతుకుల మధ్య ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ థీనస్థితిని తలచుకుని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలతో క్షేమంగా బయట పడాలని దేవుడిని కోరుకుంటున్నారు. మార్చి 14న ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం అరుధంతి తన సోదురుడితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

IPL 2024: స్టార్స్‌తో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. వేడుకల్లో పెర్ఫార్మ్ చేసేది ఎవరంటే ?

సరిగ్గా కోవలం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి వీరి స్కూటీని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రస్తుతం అరుంధతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుంది. అయితే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు వైద్యం అందించడానికి ఆర్ధిక సాయం చేయాలంటూ సీరియల్ నటి గోపిక అనిల్ తన సోషల్ మీడియా వేదికగా అందర్నీ వేడుకోవడం పలువురిని కలిచివేస్తోంది. ఇక రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత ఆమె కుటుంబానికి లేదని, దీంతో తాము తోచినంత సహాయం చేస్తన్నామని, అయితే, ప్రస్తుతం ఆమె చికిత్సకు అది సరిపోవడం లేదని గోపిక తెలిపింది. అందువల్ల ఆమె కుటుంబానికి మీ వంతు కూడా సహాయం చేస్తే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు సహాయపడుతుంది అంటూ వారి బ్యాంకు నెంబర్, ఫోన్‌ నంబర్‌ వివరాలను ఇన్‌స్టా పోస్టులో పొందుపరిచింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నటి అరుంధతి నాయర్ తమిళ్‌లో 2014లో వచ్చిన ‘పొంగి ఎలు మనోహర’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘సవిరుమాండికుమ్‌ శివానందికమ్‌’, ‘సైతాన్‌’, ‘పిస్తా’, ‘ఆయిరం పోర్కాసుకల్‌’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈమె 2018 మలయాళంలో విడుదలైన ‘ఒట్టకోరు కముకన్‌’తో మలయాళంలో హీరోయిన్‌గా అరంగెట్రం చేసింది. కానీ, ఎక్కువగా ఈమెకు విజయ్ ఆంటోని సరసన నటించిన సైతాన్ మూవీనే మంచి పాపులారిటీ తెచ్చి పెట్టింది. ఇక అరుంధతి చివరిగా గత ఏడాది విడుదలైన ఆయిరం ‘పోర్కాసుకల్‌’ అనే మువీలో నటించింది. అరుంధ‌తి త్వర‌గా కోలుకోవాల‌ని సినీ సెల‌బ్రిటీలు, నెటిజ‌న్లు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.