Venu Swamy: వైన్ బాటిల్‌తో వేణుస్వామి పూజలు.. డింపుల్‌తో పూజ ఫొటో వైరల్

మామూలుగానే సెలెబ్రిటీల ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు చేస్తుంటాడు. రష్మిక మందన్నా కూడా ఆ మధ్య పూజ చేయించుకుంది. అషూ రెడ్డి కూడా ఇలానే వేణు స్వామితో పూజలు చేయించింది. సెలెబ్రిటీల జాతకాలు చెప్తూ.. సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తుంటాడు వేణు స్వామి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2024 | 06:47 PMLast Updated on: Mar 05, 2024 | 6:47 PM

Astrologer Venu Swamys Shocking Rituals With Wine Bottle With Dimple Hayati

Venu Swamy: సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో.. ఎందుకు అవుతుందో చెప్పలేం. గతేడాది హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో చేసిన వేణుస్వామి చేసిన పూజలు.. ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయ్. డింపుల్ ఇంట్లో వేణు స్వామి చేసిన ఆ పూజ ఏంటో గానీ.. ఇప్పుడు ఆ ఫోటో, ఫోటోలో ఉన్న వైన్ బాటిల్ మీద చర్చ జరుగుతోంది. అదేదో హోమగుండంలాగా వేసి.. వాటి చుట్టూ వైన్‌ బాటిళ్లు పెట్టారు. దీనిపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగానే సెలెబ్రిటీల ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు చేస్తుంటాడు.

MAHESH BABU: ఒక్కడు విషయంలో మహేశ్ తప్పు చేశాడా..? సోషల్ మీడియాలో రచ్చ..

రష్మిక మందన్నా కూడా ఆ మధ్య పూజ చేయించుకుంది. అషూ రెడ్డి కూడా ఇలానే వేణు స్వామితో పూజలు చేయించింది. సెలెబ్రిటీల జాతకాలు చెప్తూ.. సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తుంటాడు వేణు స్వామి. నాగ చైతన్య సమంత విడిపోతారని, అందరి కంటే ముందుగానే భవిష్యత్తుని ఊహించి చెప్పాడు. చివరకు అతను చెప్పినట్టుగానే వారిద్దరూ విడిపోయారు. నాగ చైతన్య సమంత విడాకుల టైంలో.. వేణు స్వామి మరింతగా ట్రెండ్ అయ్యాడు. ప్రభాస్ సినిమాలు ఇక ఆడవు, ఆయనకు హెల్త్ సమస్యలు ఎక్కువగా వస్తాయంటూ జోస్యం చెప్పాడు. ప్రతీసారి ఇలా స్టార్ సెలెబ్రిటీ గురించి మాట్లాడి వైరల్ అవుతుంటాడు. గతేడాది డింపుల్ హయతి ఇంట్లో ప్రత్యేక పూజలు చేశాడు. ఆ పూజకు సంబంధించిన ఫోటో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

ఈ పూజలో వైన్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. ఇలా పూజలు ఎవరైనా చేస్తారా అంటూ అంతా ఫైర్ అవుతున్నారు. అయితే వేణుస్వామి ఇలా మందు బాటిళ్లు పెట్టి పూజలు చేయడం మీద క్లారిటీ ఇచ్చాడు. తాను అలానే పూజలు చేస్తానని, ఆల్కహాల్ తాగే వారికి అదే తీర్థంగా ఇస్తానని, ఆల్కహాల్ తాగని వారికి కూల్ డ్రింక్‌ను తీర్థంగా ఇస్తానంటూ చెప్పిన వీడియోలు కూడా వైరల్ అవుతోంది. ఇవేం పూజలో అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.