Bigg Boss 7 : రతిక , ప్రశాంత్ మధ్య డైలాగ్ వార్.. అన్నా పంచె జాగ్రత్త

బిగ్ బాస్ సీజన్ 7 క్లైమాక్స్ కు చేరుకుంటుంది. 11వ వారం కంప్లీట్ చేసుకుని 12వ వారంలోకి వచ్చేసింది. ఇంట్లో పది మంది సభ్యులతో కళకళలాడుతోంది. వీకెండ్ లో ఎలాంటి ఎలిమినేషన్ లేకుపోవడంతో జాలీగా గడిపిన ఇంటిసభ్యులు.. బఇంటిసభ్యులు వీకెండ్ లో జరిగిన టాపిక్ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత బిగ్ బాస్ నామినేషన్ల ప్రక్రియను మొదలు పెట్టాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2023 | 10:01 AMLast Updated on: Nov 21, 2023 | 10:01 AM

Bigg Boss Season 7 Will Reach Its Climax Dialogue War Between Rathika And Prashant Anna Panche Beware

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) క్లైమాక్స్ కు చేరుకుంటుంది. 11వ వారం కంప్లీట్ చేసుకుని 12వ వారంలోకి వచ్చేసింది. ఇంట్లో పది మంది సభ్యులతో కళకళలాడుతోంది. వీకెండ్ లో ఎలాంటి ఎలిమినేషన్ లేకుపోవడంతో జాలీగా గడిపిన ఇంటిసభ్యులు.. బఇంటిసభ్యులు వీకెండ్ లో జరిగిన టాపిక్ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత బిగ్ బాస్ నామినేషన్ల ప్రక్రియను మొదలు పెట్టాడు.

నామినేషన్స్ ప్రక్రియ లో భాగంగా ప్రతి కంటెస్టెంట్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు. అంతేకాక నామినేట్ చేసిన వారి బొమ్మ ఉన్న చికెన్ పీస్ తీసుకెళ్లి ఆకలితో ఉన్న సింహం నోటిలో పెట్టాలని ఆదేశించాడు. దీంతో ముందుగా అమర్ దీప్ రతిక యావర్ ను నామినేట్ చేశాడు. యావర్ అమర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. గౌతమ్ , ప్రశాంత్ శివాజీని నామినేట్ చేశాడు. అయితే గౌతమ్ ప్రశాంత్ మధ్య డైలాగ్ వార్ నడించింది. పంచె గురించి పెద్ద పంచాయితీని నడించింది.

ఇదిలా ఉంటే.. రతిక (Rathika), ప్రశాంత్ (Prashanth) ను నామినేట్ చేసింది. ప్రశాంత్‌ సినిమా రేంజ్‌ డైలాగులతో రచ్చ చేశాడు. మరోవైపు రతిక, అమర్‌ దీప్‌ ల మధ్య కూడా ఇంట్రెస్టింగ్ వాదనలు జరిగింది. రతిక డామినేటింగ్‌ ప్రశ్నలకు, అమర్‌ దీప్‌ రియాక్షన్‌ అదిరిపోయింది. అశ్వినీ నామినేట్ చేయడానికి తన దగ్గర కారణాలు లేవని.. ఎవరిని నామినేట్ చేయాలని లేదని బిగ్ బాస్ కు చెబుతుంది. దీంతో నామినేట్ చేయక పోతే సెల్ప్ నామినేట్ అవుతావని సూచించాడు. అందుకు ఓకే అనేసింది అశ్విని. దీంతో బిగ్ బాస్ అశ్విని సెల్ప్ నామినేట్ చేశాడు. ఇక శివాజీ అర్జున్ , గౌతమ్ ను నామినేట్ చేశాడు. ఇలా హాట్ హాట్ సాగుతున్న ప్రక్రియ కు ఫుల్ స్టాప్ పెట్టిన బిగ్ బాస్.. నెక్ట్స్ డేకూడాదానిని కంటిన్యూ చేయనున్నాడు. సోమవారం నాడు అమర్ దీప్, ప్రశాంత్, యావర్, గౌతమ్ , అర్జున్, శివాజీ అశ్విని నామినేషన్లలో ఉన్నారు. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో బయటకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.