Nushrratt Bharuccha: ఇజ్రాయెల్ యుద్ధం.. క్షేమంగా ఇండియా చేరుకున్న హీరోయిన్‌..

పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన నుష్రత్ భరుచా.. తాజాగా ఇజ్రాయెల్ వెళ్లింది. అక్కడ హైఫీ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అక్కడికి వెళ్లింది. అయితే, నుష్రత్ అక్కడ ఉన్న సందర్భంలోనే ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదులు దాడులకు దిగారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 8, 2023 | 04:33 PMLast Updated on: Oct 09, 2023 | 3:15 PM

Bollywood Actress Nushrratt Bharuccha Reaches India Safely From War Hit Israel

Nushrratt Bharuccha: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధంలో చిక్కుకున్న భారతీయ నటి నుష్రత్ భరుచా క్షేమంగా ఇండియా చేరుకుంది. ముంబై ఎయిర్‌పోర్టుకు ఆమె చేరుకున్నట్లు సమాచారం. దీంతో బాలీవుడ్ సహా ఆమె కోసం ఆరా తీసిన భారతీయులు ఊపిరిపీల్చుకున్నారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన నుష్రత్ భరుచా.. తాజాగా ఇజ్రాయెల్ వెళ్లింది. అక్కడ హైఫీ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అక్కడికి వెళ్లింది. అయితే, నుష్రత్ అక్కడ ఉన్న సందర్భంలోనే ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదులు దాడులకు దిగారు.

గాజా స్ట్రిప్‌ నుంచి హమాస్‌ గ్రూప్‌ 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌ మీద దాడి చేసింది. ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే బీభత్సం జరిగిపోయింది. పాలస్తీనా దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రకటించింది. రెండు దేశాల మధ్యా భీతావహ వాతావరణం నెలకొంది. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ నుష్రత్‌ భరుచా చిక్కుకుపోయింది. ఫిలిం ఫెస్టివల్ కోసం ఇజ్రాయెల్ వెళ్లిన ఆమె కొన్ని రోజుల నుంచి అక్కడే ఉంటోంది. ఈ గ్యాప్‌లోనే రెండు దేశాల మధ్య పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా గాజా దాడి చేయడం.. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ రియాక్ట్‌ అవడంతో ఆమె అక్కడే నుస్రత్‌ ఇజ్రాయెల్‌లోనే చిక్కుకుపోయింది. నుష్రత్ గురించిన వివరాలు తెలుసుకునేందుకు ఆమె టీం ప్రయత్నించింది. అయితే, ఆమె నుంచి స్పందన రాలేదు. దీంతో ఏం జరిగిందో అనే ఆందోళన పరిస్థితి నెలకొంది. నుష్రత్ బృందం ఆమె గురించి ఆరా తీసింది. సుమారు 18 గంటల తర్వాత ఆమె ఆచూకీ లభించింది.

ఇండియన్ ఎంబసీ సాయంతో ఇండియాకు వచ్చింది. నుష్రత్ క్షేమంగా ఇండియా చేరుకున్నట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నుష్రత్‌ నటించింది. చివరిసారిగా అకెలీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె 2021లో విడుదలైన సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చోరీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తోంది. నుస్రత్‌ భరూచా 2010లో తెలుగులో ‘తాజ్‌ మహాల్‌’ అనే సినిమాలో కూడా కనిపించింది. ఆ తర్వాత 2016లో తమిళంలో ‘వాలిబా రాజా’ సినిమాలో నటించింది.