ప్రభాస్ దెబ్బ, బాలీవుడ్ కు ఏం కష్టమొచ్చింది మావా

ఏదేమైనా బాహుబలి, కల్కీ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మధ్యలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసి మల్టీ స్టారర్ అంటే ఈ రేంజ్ లో ఉండాలి అని చెప్పింది. ఇక కల్కీ సినిమాతో బాలీవుడ్ కు ఓ టార్గెట్ సెట్ చేసింది టాలీవుడ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2024 | 07:34 PMLast Updated on: Oct 02, 2024 | 7:34 PM

Bollywood Top Producer In Hyderabad

ఏదేమైనా బాహుబలి, కల్కీ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మధ్యలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసి మల్టీ స్టారర్ అంటే ఈ రేంజ్ లో ఉండాలి అని చెప్పింది. ఇక కల్కీ సినిమాతో బాలీవుడ్ కు ఓ టార్గెట్ సెట్ చేసింది టాలీవుడ్. ప్రభాస్ దెబ్బకు ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలు కూడా చిన్న హీరోలు అయిపోయారు. ఇటీవల సిద్దు జొన్నలగడ్డ కామెంట్ చేసినట్టు బాలీవుడ్ హిట్ సినిమాలకు ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు వసూళ్లు దాదాపుగా ఒకే విధంగా ఉంటున్నాయి అనే మాట వాస్తవం.

ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. మూడో సినిమా కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ కాంబినేషన్ ను సెట్ చేయడానికి బాలీవుడ్ స్టార్ నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ షేక్ అయిన మాట వాస్తవం. అది ఓ తెలుగు డైరెక్టర్ చేయడం బాలీవుడ్ కు సూపర్ హిట్ ఇవ్వడం అక్కడి వాళ్ళకు ఒక షాక్ లా ఉంది. ఇప్పుడు అందుకే మల్టీ స్టారర్ సినిమాలు అనే మాట బాలీవుడ్ మాట్లాడుతోంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

ఇక్కడి స్టార్ హీరోలతో కలిసి తమ స్టార్ హీరోలు సినిమాలు చేస్తారని మేము ఒప్పిస్తామని మల్టీ స్టారర్ సినిమాలను సెట్ చేద్దామని కరణ్ జోహార్ లాంటి నిర్మాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దసరాకు కరణ్ జోహార్ హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మల్టీ స్టారర్ సినిమాపై చర్చించే అవకాశం ఉందని టాక్. సందీప్ రెడ్డి వంగాతో కూడా కరణ్ జోహార్ ఓ సిట్టింగ్ వేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో హ్రితిక్ రోషన్ ను తీసుకునే విధంగా ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈ సినిమా కథ కూడా సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. మరి సందీప్ రెడ్డి వంగా ప్లాన్ ఏంటో చూడాలి.