జోకర్ కామెంట్స్ మంచు విష్ణుకి బాలీవుడ్ వార్నింగ్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2024 | 02:24 PMLast Updated on: Aug 23, 2024 | 2:24 PM

Bollywood Warning To Manchu Vishnu

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై టాలీవుడ్ హీరోలు అందరూ మండిపడ్డారు. ప్రభాస్ దెబ్బకు 8 ఏళ్ళ నుంచి బాలీవుడ్ ఒక జోకర్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షరాలు శ్రీమతి పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాసిన మంచు విష్ణు… తెలుగు సినీ వర్గాల్లో ప్రభాస్ పై అర్షద్ వార్సీ వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయి అంటూ అసహనం వ్యక్తం చేసారు.

ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కును మేము గౌరవిస్తామని… కానీ నటుడు ప్రభాస్ గురించి చేసిన చాలా తప్పుడు వ్యాఖ్యను నేను విచారిస్తున్నానని ఆయన మండిపడ్డారు. వార్సి చేసిన వ్యాఖ్య తెలుగు సినీ వర్గాల్లో మరియు అభిమానులలో చాలా మంది మనోభావాలను దెబ్బతీసిందన్న విష్ణూ నేటి సోషల్ మీడియా యుగంలో, ప్రతి పదం త్వరగా విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మనం, పబ్లిక్ ఫిగర్స్, మన వ్యక్తీకరణలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమని హితవు పలికారు.

వార్సి యొక్క వ్యాఖ్యలు సినీ ప్రేమికులలో మరియు మా సినీ సోదరులలో అనవసరమైన ఆందోళనలను సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేసారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని మా సెంటిమెంట్‌ను పంచుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను అంటూ సున్నితంగా హెచ్చరించారు. భవిష్యత్తులో తోటి నటీనటుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసిందిగా అర్షద్ వార్సీని కోరుతున్నామన్నారు విష్ణు. ప్రాంతీయ అనుబంధంతో సంబంధం లేకుండా, మన సహోద్యోగులలో ప్రతి ఒక్కరికీ దక్కాల్సిన గౌరవం మరియు గౌరవాన్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం అని హితవు పలికారు.

మనమందరం ఒకే పెద్ద కుటుంబంలో భాగమని, సినిమా పట్ల మనకున్న అభిరుచికి కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోండని సూచించారు. మన బలం మన ఐక్యతలో ఉంది మరియు ఈ ఐక్యతను కాపాడుకోవడం మన సమిష్టి బాధ్యతని… మా పరిశ్రమ కోసం నిలబడే సామరస్యం మరియు గౌరవాన్ని కొనసాగించడంలో మీ మద్దతు కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు విష్ణు.