Poonam Pandey : నిజం త్వరలో బయటకు వస్తుంది

బాలీవుడ్ (Bollywood) బోల్డ్ బ్యూటీ (Bold Beaut) మరోసారి వైరల్‌గా మారింది... అమ్మడు రీసెంట్‌గా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..అందులో “నిజం త్వరలో బయటకు వస్తుంది” అని రాసింది.. దీంతో.. అది కాస్తా వైరల్‌గా మారింది. పూనమ్ పాండే ఇలాంటి పోస్ట్ ఎందుకు షేర్ చేసిందో అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2024 | 11:07 AMLast Updated on: Feb 18, 2024 | 11:07 AM

Bollywoods Bold Beauty Has Gone Viral Once Again

బాలీవుడ్ (Bollywood) బోల్డ్ బ్యూటీ (Bold Beaut) మరోసారి వైరల్‌గా మారింది… అమ్మడు రీసెంట్‌గా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..అందులో “నిజం త్వరలో బయటకు వస్తుంది” అని రాసింది.. దీంతో.. అది కాస్తా వైరల్‌గా మారింది. పూనమ్ పాండే ఇలాంటి పోస్ట్ ఎందుకు షేర్ చేసిందో అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.. పూనమ్ పోస్ట్‌లను అర్థం చేసుకోవడం కష్టమే అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.. ఇటీవల పూనమ్ గర్భాశయ క్యాన్సర్‌తో మరిణించిందటూ పెట్టిన పోస్ట్ దుమారం రేపిన నేపథ్యంలో.. పూనమ్ పాండే పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్‌గా మారింది.. పూనమ్ పాండే పోస్ట్‌ను ఎగతాళి చేస్తూ యూజర్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

అనుకున్నదే జరిగింది.. పూనమ్ పాండే (Poonam Pandey) మృతి వార్త కేవలం పబ్లిసిటీ స్టంటే అని తేలిపోయింది. సర్వైకల్ క్యాన్సర్‌తో తాను చనిపోయినట్టు వచ్చిన వార్తలుఅంతా తూచ్‌ అంటూ పూనమ్‌ వీడియో రిలీజ్ చేసింది.. ఇన్‌స్టాలో తాను బతికే ఉన్నానని వీడియో విడుదల చేసిన పూనమ్.. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కోసమే ఇలా చేశానని వెల్లడించింది. అయితే పూనమ్‌ చర్యలపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచారం కోసం ఇంతలా దిగజారాలా అంటూ నెటిజన్ల ఫైర్
అయ్యారు.. ఇదేం పద్ధతంటూ అమ్మడిని ఓ ఆటాడుకున్నారు..

నిజానికి ఇలా చేయడం పూనమ్‌కు కొత్తేమీ కాదు.. చాలా కాలం క్రితమే మోడల్‌గా పరిచయమైన ఈ బోల్డ్ బ్యూటీ.. 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియా విజేతగా నిలిస్తే న్యూడ్‌గా ఫోజులిస్తానంటూ సంచలనం అయిపోయింది. ఆ దెబ్బతోనే అమ్మడు బాగా పాపులర్ అయింది.. ఆ తర్వాత క్రేజ్‌ను మాత్రం బాగా పెంచుకుంది. ఈ క్రమంలోనే ‘నషా’ (Nasha) అనే సినిమాతో ఎంటరైంది. ఆ తర్వాత తెలుగులోనూ ‘మాలినీ అండ్ కో’ చేసింది. ఇక, ‘లాకప్’ రియాలిటీ షో తర్వాత పూనమ్ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.. పబ్లిసిటీ కోసం ఏదో ఒక వివాదస్పద వార్తను సృష్టించడాన్ని అలవాటుగా మార్చుకుంది.. ఆ క్రమంలోనే తాను చనిపోయానంటూ ఓ సెంటిమెంటల్ డ్రామా ఆడిన పూనమ్.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా.. నిజం త్వరలో బయటకు వస్తుంది అంటూ మరోసారి చర్చకు తెరతీసింది..