Dasara war : మూడు ఫ్యామిలీల హీరోల …బాక్సాఫీస్ యుద్ధం Ntr

టాలీవుడ్ లో మెగా, అక్కినేని, నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా నడుస్తోన్న బాక్సాఫీస్ యుద్ధం ఈ దసరా మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ మూడు ఫ్యామిలీల నుండి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రాలు ఈ దసరాకి విడుదల కానున్నట్లు ప్రకటించడంతో సినీ అభిమానులలో ఆసక్తి నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 11:00 AMLast Updated on: Mar 06, 2024 | 11:00 AM

Box Office War Of Three Families Of Heroes Ntr

 

 

టాలీవుడ్ లో మెగా, అక్కినేని, నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా నడుస్తోన్న బాక్సాఫీస్ యుద్ధం ఈ దసరా మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ మూడు ఫ్యామిలీల నుండి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రాలు ఈ దసరాకి విడుదల కానున్నట్లు ప్రకటించడంతో సినీ అభిమానులలో ఆసక్తి నెలకొంది.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను 2024 సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. RRR నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా వరకు బాక్సాఫీస్ వసూళ్లు కొల్లగొట్టాలని టార్గెట్ గా పెట్టుకుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి భాగాన్ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. RRR తర్వాత తారక్ నుంచి రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ను అక్టోబర్ 11న విడుదల చేయాలని భావిస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో నటసింహం నటిస్తోన్న ఈ చిత్రాన్ని 2024 విజయ దశమికే విడుదల చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భావిస్తున్నారట. అక్టోబర్ 3వ తేదీని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ దసరా పోరులో ఎవరు ఎవరిపై పైచెయ్యి సాధిస్తారనేది పక్కన పెడితే, ఈ విజయ దశమి పోరు మాత్రం చాలా రసవత్తరంగా మారే అవకాశం వుంది. ఈ ఫైట్ కోసం టాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.