Ntr: సెల్ఫీ కోసం ఎగబడ్డ సెలబ్రెటీలు.. ఎన్టీఆర్‌ క్రేజ్‌ మామూలుగా లేదుగా

ట్రిపులార్‌ సినిమా ఎన్టీఆర్‌ క్రేజ్‌ను ఎక్కడికో తీసుకువెళ్లింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2023 | 11:20 AMLast Updated on: Mar 12, 2023 | 11:28 AM

Celebritis Met Jr Ntr In Oskar Awards

ఇప్పుడు ఎన్టీఆర్‌ నార్మల్‌ స్టార్‌ కాదు.. స్టార్లకే స్టార్‌. ఆస్కార్‌ ఈవెంట్‌కు అమెరికా వెళ్లిన ఎన్టీఆర్‌కు.. అమెరికన్‌ ఫ్యాన్స్‌ ఒక రేంజ్‌లో గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు. జీవితంలో మర్చిపోలేని రిసీవింగ్‌ ఇచ్చారు. సరే ఫ్యాన్సే కదా.. వాళ్ల అభిమానం అలాగే ఉంటుంది. హీరోలు చాలా రేర్‌గా దగ్గరగా కనిపిస్తారు కాబట్టి.. సెల్ఫీలంటూ వాళ్లు ఎగబడటం కామన్. కానీ.. సినిమా స్టార్స్‌ కూడా ఎన్టీఆర్‌ను చూస్తే ఇప్పడు ఫ్యాన్స్‌ లాగే రియాక్ట్‌ అవుతున్నారు. ఎన్టీఆర్‌ కనిపిస్తే చాలు అందరి ఫోన్‌ కెమెరాలు ఆటోమేటిక్‌గా ఆన్‌ అయిపోతున్నాయి. రీసెంట్‌గా హీరోయిన్‌ ప్రీతిజింటా కూడా ఎన్టీఆర్‌తో అలాగే సెల్ఫీ తీసుకుంది. రేపు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్‌ అవార్డ్‌ ఫంక్షన్‌ జరగనుంది.

ఈ ఈవెంట్‌ కోసం ట్రిపులార్‌ టీం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఆస్కార్‌ ఫంక్షన్‌లో పాల్గొనే చాలా మంది అమెరికాలోనే ఉన్నారు. వీళ్ళందరికీ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ప్రీ-ఆస్కార్‌ పార్టీ ఇచ్చింది. స్టార్స్‌ అందరినీ ఇన్వైట్‌ చేసి గ్రాండ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి ఎన్టీఆర్‌ కూడా వచ్చాడు. అక్కడ మనోడిని చూసిన ప్రీతిజింటా.. వెంటనే ఒక సెల్ఫీ అంటూ ఎన్టీఆర్‌ దగ్గిరికి వచ్చిందట. సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను ఇన్‌స్టాలో కూడా పోస్ట్‌ చేసింది. ఆస్కార్‌ అందుకునేందుకు వచ్చిన స్టార్స్‌తో ఫొటోలు దిగడం చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చింది. సాధారణంగా హీరోలు కనిపిస్తే ఫ్యాన్స్‌ ఇలా చేయడం కామన్‌ కానీ.. ఇక్కడ ప్రీతిజింటా కూడా ఒక్ ఫ్యాన్‌లా సెల్ఫీ దిగడం, దాన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో తారక్‌ ఫ్యాన్స్‌ తెగ కుషీ అవుతున్నారు. తమ హీరో క్రేజ్‌ రోజు రోజుకూ పెరిగపోతోందని తెగ సంబరపడిపోతున్నారు.