ఈ వార్త వింటే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు పక్కా

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 27, 2024 | 12:03 PMLast Updated on: Aug 27, 2024 | 12:03 PM

Chiranjeevi All Time Hit Jagadhekaveerudu Athiloka Sundhari Movie Re Release

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రెండు సినిమాలు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తాయి. ఆ సినిమాల పేర్లు విన్నా సరే మెగా ఫ్యాన్స్ ఊగిపోతారు. ఆ రెండు సినిమాలే ఇంద్ర, జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ రెండు సినిమాల్లో మెగాస్టార్ నటనకు తెలుగు సినీ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఒక్కో సీన్ లో ఆయన నటన టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది అనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో ఆయనను చాలా కొత్తగా చూసారు ఫ్యాన్స్. ఇటీవల ఇంద్ర సినిమా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇంద్ర సినిమాను విడుదల చేసారు.

సినిమాకు మంచి స్పందన రావడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ వస్తే బాగుంటుంది అని కోరుతున్నారు ఫ్యాన్స్. అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సైతం సీక్వెల్ వస్తే మంచిది అని కోరుతున్నారు. దీనిపై ఈ రెండు సినిమాల నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ స్పందించారు. ఇంద్ర సినిమా రీ రిలీజ్ సందర్భంగా టీం అంతా కలిసి ముచ్చటించింది. ఆ సమయంలో అశ్వనీ దత్ మాట్లాడుతూ… చిరంజీవి నటించిన ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల సీక్వెల్స్ కోసం చాలా మంది అడుగుతున్నారని అన్నారు.

ఆ రెండు సినిమాల సీక్వెల్స్ ని తప్పకుండా తీస్తామని ఆయన స్పష్టం చేసారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. దీనితో ఫ్యాన్స్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాల్లో నటించే హీరో ఎవరు అనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇంద్ర సినిమా సీక్వెల్ లో చిరంజీవి నటిస్తారా లేక రామ్ చరణ్ కనపడతారా అంటూ ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి అయితే కచ్చితంగా రామ్ చరణ్ నటిస్తారు అనే క్లారిటీ ఉంది. మరి ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.