Chiru allu arjun : ఒకే వేదికపై చిరంజీవి, అల్లు అర్జున్

తన స్నేహితుడు, వైసీపీ (YCP) ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravichandra Kishore Reddy) కి అల్లు అర్జున్ మద్దతు తెలపడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 17, 2024 | 11:25 AMLast Updated on: May 17, 2024 | 11:25 AM

Chiranjeevi And Allu Arjun On The Same Stage

తన స్నేహితుడు, వైసీపీ (YCP) ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravichandra Kishore Reddy) కి అల్లు అర్జున్ మద్దతు తెలపడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి నుంచి సోషల్ మీడియా.. ‘మెగా వర్సెస్ అల్లు’ (Mega vs Allu) అన్నట్టుగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఒకే వేదికపై చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ (Allu Arjun) కనిపించనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.

దాసరి జన్మదినం సందర్భంగా మే 4న డైరెక్టర్స్ అసోసియేషన్ ఓ పెద్ద ఈవెంట్ చేయాలని ప్లాన్ చేసింది. కానీ ఎల‌క్ష‌న్ కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆ ఈవెంట్ జరగలేదు. అయితే 19న హైద‌రాబాద్ లోని అదే స్టేడియంలో అంటే ఎల్‌.బీ స్టేడియంలోనే ఈ ఈవెంట్ ను అట్ట‌హాసంగా నిర్వహించాలని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్లాన్ చేసింది. ఇందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. డైరెక్టర్స్ అంతా ఒక చోట చేరి చేసే ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.ఈ వేడుకకు చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో పాటు.. దర్శకులంతా హాజరు కానున్నారు.

అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి, అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచే అవకాశముంది. ‘మెగా వర్సెస్ అల్లు’ అంటూ అభిమానుల మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో.. ఒక వేదికపై చిరంజీవి, బన్నీ కలవనుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఆల్రెడీ డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం ప్రభాస్ రూ.25 లక్షల వరకు విరాళం ఇవ్వడం జరిగింది. చిరంజీవి అయితే మొదటి నుండి తన సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. వీరితో పాటు అల్లు అర్జున్ కూడా డైరెక్టర్స్ అసోసియేషన్ కి అండగా నిలబడుతున్నట్టు టాక్ నడుస్తుంది. సో మొత్తంగా ఈ ఈవెంట్ సక్సెస్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఈ హీరోల అభిమానులకి కూడా ఇది కన్నుల విందు చేసే ఛాన్స్ ఉంది