CHIRANJEEVI: 75 ఏళ్ల వ్య‌క్తిగా మెగాస్టార్.. అదిరిపోనున్న చిరు సాహ‌సాలు

ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లను కూడా పెడుతున్నార‌ని టాక్ వినిస్తోంది. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఇందులో ఫ్లాష్‌బ్యాక్ సీన్.. గతంలో ఏ చిత్రంలో చూడని విధంగా అదిరిపోయేలా డిజైన్ చేసినట్లు తెలిసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2024 | 01:38 PMLast Updated on: Feb 27, 2024 | 6:23 PM

Chiranjeevi Doing An Old Age Getup Of 75 Years In Vishwambhara Movie

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి అభిమానుల దృష్టంతా ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీ మీదే ఉంది. ‘భోళాశంకర్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న చిరు.. దాని తర్వాత చేస్తున్న చిత్రం కావ‌డంతో ఈ మూవీ కోసం మెగాభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బేనర్లో, దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. చిరంజీవి చాలా కొత్త‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

hyderabad drugs: అప్పుడు అక్క.. ఇప్పుడు చెల్లి.. ఈసారి బజ్జీలు కాదు.. డ్రగ్సే..

ఇప్ప‌టికే ఈ మూవీపై ప‌లు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బ‌య‌ట‌కు రాగా.. రీసెంట్‌గా వ‌చ్చిన అప్‌డేట్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లను కూడా పెడుతున్నార‌ని టాక్ వినిస్తోంది. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఇందులో ఫ్లాష్‌బ్యాక్ సీన్.. గతంలో ఏ చిత్రంలో చూడని విధంగా అదిరిపోయేలా డిజైన్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు.. ‘విశ్వంభర’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఐదేళ్ల వృద్ధుడి గెటప్‌తో కనిపించబోతున్నాడ‌ట. ఆ వ‌య‌స్సు క్యారెక్ట‌ర్‌లో చిరు చేసే సాహసాలు ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేస్తాయని, పైగా చిరంజీవి లుక్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్స్ కూడా గ్రాండ్ విజువల్స్‌తో అద్భుతంగా ఉంటాయన్న న్యూస్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

కాగా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మెగాస్టార్‌ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఈ సినిమాలో ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని చెప్ప‌డంతో విశ్వంభ‌ర‌పై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. ఈ ప్రెస్టీజియ‌స్ మూవీలో హీరోయిన్‌గా త్రిష న‌టిస్తుండ‌గా.. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. మ‌రి మొత్తానికి మెగా ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో తెర‌కెక్కుతున్న ఈ భారీ మూవీ ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి ఫీల్ అందించ‌నుందో చూడాలి మ‌రి.