Chiru -Vijayashanthi : చిరంజీవికి విజయశాంతి ఓకే చెప్తుందా…

ఇప్పుడంటే హీరోయిన్లకి కొంచం ఇంపార్టెన్స్ తగ్గింది. కానీ గతంలో అలా కాదు. హీరోలకి ధీటుగా రాణించి కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2024 | 03:30 PMLast Updated on: Apr 23, 2024 | 3:30 PM

Chiranjeevi Says Vijayashanti Is Ok

ఇప్పుడంటే హీరోయిన్లకి కొంచం ఇంపార్టెన్స్ తగ్గింది. కానీ గతంలో అలా కాదు. హీరోలకి ధీటుగా రాణించి కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నారు. అసలు పలానా హీరో, హీరోయిన్ కాంబినేషన్ లో మూవీ రావడం ఆలస్యం. ప్రేక్షకులు థియేటర్లకి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలా ప్రేక్షకులని తమ నటనతో మెస్మరైజ్ చేసి థియేటర్లకి పరుగులు పెట్టించిన కాంబో చిరంజీవి విజయశాంతి. సిల్వర్ స్క్రీన్ మీద ఆ ఇద్దరి ఫెయిర్ కి తిరుగులేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్లిద్దరు కలిసి నటించబోతున్నారనే చర్చలు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినపడుతున్నాయి.

చిరు (Chiranjeevi) అప్ కమింగ్ మూవీ విశ్వంభర. షూటింగ్ దశలో ఉంది. త్రిష (Trisha) ఒక హీరోయిన్ గా చేస్తుంది. ఆల్రెడీ చిరు త్రిషల మధ్య కొన్ని సీన్స్ ని కూడా తెరకెక్కించారు. ఇక ఇందులో ఒక సీనియర్ హీరోయిన్ కి చోటు ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ క్యారక్టర్ ని విజయశాంతి చేత చేయించాలని చిత్ర యూనిట్ బావిస్తుందంట. కథ ప్రకారం ఆమె క్యారక్టర్ సెకండ్ హాఫ్ లో వస్తుందంట. అది ఎంటైర్ సినిమాకే చాలా కీలకం అని తెలుస్తుంది. విజయ శాంతి (Vijayashanthi) లాంటి సీనియర్ నటీమణి అయితేనే న్యాయం చేయగలదని భావిస్తున్నారు. చిరు దగ్గరనుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో ఆమెని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక చిరు అండ్ విజయశాంతి ఇప్పటివరకు 19 సినిమాల్లో కలిసి నటించారు. దాదాపుగా అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. చివరగా మెకానిక్ అల్లుడు లో కలిసి నటించారు. 1993 లో ఆ మూవీ వచ్చింది. అంటే మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత కలిసి నటించబోతున్నారు. ఆ ఇద్దరు కలిసి చేసిన డాన్స్ ఒకప్పుడు తెలుగు ప్రజలని ఒక ఊపు ఊపింది. మరి విశ్వంభర లో కూడా ఆ ఇద్దరు కలిసి స్టెప్స్ వేస్తారేమో చూడాలి. 2020 లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సరిలేరు నీకెవ్వరూ (Sarileru Neekevvaru) విజయశాంతి చివరిగా చేసిన సినిమా. ఇక ఇటీవల విశ్వంభర నుంచి రిలీజ్ అయిన చిరంజీవి స్టిల్స్ మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. యు వి క్రియేషన్స్ నిర్మిస్తుండగా వశిష్ట మల్లిడి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.