Chiru : విశ్వంభర నుంచి ఆ రైటర్ తప్పుకోవడం వెనక చిరు ప్రమేయం..?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంభర.. ఈ మూవీలో హీరోయిన్ త్రిష (Trisha) డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భోళా శంకర్‌ లాంటి భారీ ప్లాప్ తర్వాత చిరు చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ జెట్‌ స్పీడుతో తెరకెక్కుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2024 | 12:20 PMLast Updated on: Mar 14, 2024 | 12:20 PM

Chirus Involvement Behind The Writers Departure From Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంభర.. ఈ మూవీలో హీరోయిన్ త్రిష (Trisha) డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భోళా శంకర్‌ లాంటి భారీ ప్లాప్ తర్వాత చిరు చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ జెట్‌ స్పీడుతో తెరకెక్కుతోంది. ఇందులో సోషియో ఫాంటసీ ఎలిమెంట్లు ఉంటాయట. పీరియడ్‌ అంశాలకు, ఫాంటసీ ఎలిమెంట్లని జోడించి దర్శకుడు వశిష్ట ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే.. విశ్వంభర (Vishwambhara) మూవీకి సంబంధించి వినిపిస్తున్న ఓ లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి కెరీర్‌లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. అలాంటి క్లాసిక్‌ జోనర్‌తోనే విశ్వంభర చిత్రం చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమా టీమ్‌ నుండి రీసెంట్‌గా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ ప్రెస్టీజియస్‌ మూవీకి సంభాష‌ణ‌లు అందిస్తున్న బుర్రా సాయిమాధ‌వ్ త‌ప్పుకొన్నట్లు ఓ వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయ‌న స్థానంలో మ‌రో ర‌చ‌యిత టీమ్‌లో చేరారట.. విశ్వంభరలోని కొన్ని స‌న్నివేశాల్ని బుర్రా సాయిమాధ‌వ్ ఇప్పటికే రాశారు. అయినప్పటికీ.. ఆయన సడన్‌గా మూవీ నుంచి తప్పుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే.. సాయిమాధవ్ బుర్రా యూనిట్ తో మనస్పర్ధల వల్ల ఆయన తప్పుకున్నారా? లేక వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

విశ్వంభర మూవీకి సంబంధించి దర్శకుడు వశిష్ట ఒక స్టయిల్‌ని ఫాలో అవుతున్నారట. కానీ అది సాయిమాధవ్‌కి నచ్చలేదని, ఇలానే రాయాలని వశిష్ట తనకు చెప్పడం.. ఈ సీనియర్‌ రైటర్‌కి నచ్చలేదంటున్నారు. అందుకే సినిమా నుంచి తప్పుకున్నారంటూ ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అయితే ఈ విషయంలో చిరంజీవి ప్రమేయం లేదట.. ఆయనకు తెలియకుండానే ఇది జరిగిందట.. మరి ఇందులో నిజానిజాలపై ఓ క్లారిటీ లేనప్పటికీ ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా.. చిరు కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే వశిష్ట కూడా ఈ మూవీ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. చిరంజీవి కోరుకున్న పాన్ ఇండియా హిట్ ను ఎంత వరకు అందిస్తుందో చూడాలి మరి..