ప్రశాంత్ ను బాలయ్య అంత నమ్మాడా…?

అందరూ ఊహించిన విధంగానే... నందమూరి నట సింహం... బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు అయిపోయింది. సుధాకర్ చెరుకూరి నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ మరియు లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో... సినిమాను అధికారికంగా ప్రకటించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2024 | 12:02 PMLast Updated on: Sep 06, 2024 | 12:02 PM

Did Balayya Trust Prashant So Much

అందరూ ఊహించిన విధంగానే… నందమూరి నట సింహం… బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు అయిపోయింది. సుధాకర్ చెరుకూరి నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ మరియు లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో… సినిమాను అధికారికంగా ప్రకటించారు. బాలయ్య చిన్న కుమార్తె… తేజెస్విని సమర్పణలో వస్తున్న చిత్రం ఇది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగమైన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పురాణాల ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని అధికారికంగా మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. గత నాలుగేళ్ళుగా మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి బాలకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. పలువురు దర్శకులతో బాలయ్య చర్చలు కూడా జరిపారు. తన వద్ద ఆదిత్య 369 సీక్వెల్ ను బాలయ్య ప్లాన్ చేసారు. దానికి సంబంధించిన కథ కూడా బాలయ్య రెడీ చేసుకున్నారు. కాని చివరికి ప్రశాంత్ వర్మను బాలయ్య ఎంపిక చేసారు. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ తానేంటి అనేది ప్రూవ్ చేసుకోవడంతో బాలయ్య ఇప్పుడు మోక్షజ్ఞ లాంచ్ కు ప్రశాంత్ నే ఎంపిక చేసుకున్నారు.

ఇప్పుడు మోక్షజ్ఞను పాన్ ఇండియా సినిమాతో లాంచ్ చేయడానికి రెడీ అయ్యారు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం… ఈ సినిమా సోషియో-ఫాంటసీ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మోక్షజ్ఞ గత రెండు నెలల నుంచి యాక్షన్ సీన్స్ ని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఒక స్టిల్ ని విడుదల చేసారు. ఈ స్టిల్ లో బాలయ్య వారసుడు చాలా హ్యాండ్సంగా కనిపిస్తున్నాడు. మొన్నటి వరకు బొద్దుగా ఉన్న ఈ కొత్త హీరో… సినిమా కోసం చాలా స్లిమ్ అయ్యాడు. దీనిపై ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావడం చాలా పెద్ద గౌరవం అలాగే పెద్ద బాధ్యతగా భావిస్తున్నా అన్నారు. బాలకృష్ణ గారు నాపై, నా కథపై ఉంచిన నమ్మకానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా అంటూ కామెంట్ చేసారు.