DIRECTOR SUJEETH: OG తర్వాత.. మహేశే టార్గెట్.. సుజిత్ ప్లాన్ ఇదే..!

పవన్ సినిమా జూన్‌లోగా పూర్తి చేసి ఆతర్వాత మహేశ్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తా అంటున్నాడు. వింటానికి బానే ఉంది. కాని మహేశ్ బాబుతో సినిమా అంటే సుజిత్ కే కాదు మరే దర్శకుడికి కూడాఇప్పుడు అంత ఈజీ కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 05:09 PMLast Updated on: Jan 31, 2024 | 5:09 PM

Director Sujeeth Planning A Movie With Mahesh Babu After Og

DIRECTOR SUJEETH: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సుజిత్ తీస్తున్న మూవీ ఓజీ. ఈ సినిమాకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ మే మొదటి వారం నుంచి మొదలవ్వొచ్చు. ఈలోగా ఏపీ ఎలక్షన్స్ సందడి పూర్తవుతుంది. కాబట్టే పవన్ ఆప్పుడు ఓజీ షూటింగ్‌కి డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే, ఈలోపే సుజిత్ బాంబు పేల్చాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబుని టార్గెట్ చేసుకున్నట్టు తేల్చాడు. పవన్ సినిమా జూన్‌లోగా పూర్తి చేసి ఆతర్వాత మహేశ్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తా అంటున్నాడు.

Jai Hanuman: ఆ లెక్క వేరే.. రాముడిగా మహేష్.. అదిరిన ప్రశాంత్ వర్మ ప్లానింగ్

వింటానికి బానే ఉంది. కాని మహేశ్ బాబుతో సినిమా అంటే సుజిత్ కే కాదు మరే దర్శకుడికి కూడాఇప్పుడు అంత ఈజీ కాదు. ఎందుకంటే తను రాజమౌళి సినిమా కోసం జర్మనీ అడవుల్లో కసరత్తులు చేస్తున్నాడు. బేసిగ్గా రాజమౌళి సినిమా అంటే ప్రిపరేషను, వర్క్ షాపులకే ఆరునెలలు, మేకింగ్‌కి ఏడాది, పోస్ట్ ప్రొడక్సన్‌కి మరో 6 నెలలు పడుతుంది. అప్పుడప్పుడు మధ్యలో ప్యాచ్ వర్కులు ఉంటాయి. అంటే కనీసం 2 ఏళ్లు లేదా మూడేళ్లు రాజమౌళి సినిమాకే పరిమితం కాబోతున్నాడు మహేశ్ బాబు. అలాంటి తనతో సినిమాను సుజిత్ ప్లాన్ చేస్తే మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. అది తెలిసే సుజిత్ అందుకు ఓకే అంటున్నాడు. ప్రభాస్ కోసం ఇలానే 4 ఏళ్లు వేయిట్ చేశాడు సుజిత్.

రన్ రాజా రన్ హిట్ తర్వాత ప్రభాస్‌తో తను సాహో ప్లాన్ చేస్తే, అది బాహుబలి తర్వాతే పట్టాలెక్కింది. అంతవరకు సుజిత్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రాజమౌళి మూవీ తర్వాతే మహేశ్ మూవీ చేసేందుకు మూడేళ్లు ఎదురుచూసేందుకు కూడా సిద్దమయ్యాడు పవన్ ఓజీ డైరెక్టర్ సుజిత్.