పెళ్లి నిజమే.. కాపురం నిజమే.. లావణ్యకు బిగ్‌ రిలీఫ్‌..

హీరో రాజ్‌తరుణ్‌, లావణ్య ఎపిసోడ్‌.. భారీ మలుపు తిరిగింది. లావణ్య కంప్లైంట్‌తో విచారణ చేపట్టిన పోలీసులు.. సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. రాజ్‌తరుణ్‌తో తనకు పెళ్లి అయిందని..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2024 | 06:06 PMLast Updated on: Sep 06, 2024 | 6:06 PM

Facts In Raj Tarun And Lavanya Case

హీరో రాజ్‌తరుణ్‌, లావణ్య ఎపిసోడ్‌.. భారీ మలుపు తిరిగింది. లావణ్య కంప్లైంట్‌తో విచారణ చేపట్టిన పోలీసులు.. సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. రాజ్‌తరుణ్‌తో తనకు పెళ్లి అయిందని.. ఐతే ఇప్పుడు తనను దూరం పెడుతూ.. మరో హీరోయిన్‌ ప్రేమలో ఉన్నాడని.. అసలు తనను పట్టించుకోవడం లేదు అన్నది లావణ్య మొదటి నుంచి వినిపిస్తున్న వాదన. పీఎస్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీనిపై రాజ్‌తరుణ్‌కు నోటీసులు కూడా జారీ అయ్యాయ్. ఆ తర్వాత మీడియాలో ఈ కేసు రచ్చగా మారడం.. ఈ వివాదంలో కొత్త కేరక్టర్లు ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ కేసు తిరిగిన మలుపులు అన్నీ ఇన్నీ కావు. ఐతే లావణ్య చెప్తోంది నిజమేనని పోలీసులు తేల్చేశారు. రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేరుస్తూ చార్జిషీట్ నమోదు చేశారు. ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేశారని.. ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని నిర్ధారణకు వచ్చారు. లావణ్య ఇంటికి వెళ్లి కీలక ఆధారాలను సేకరించారు. లావణ్య, రాజ్‌తరుణ్‌ కలిసి ఉన్న మూమెంట్స్‌తో పాటు.. ఇద్దరి ఫ్యామిలీలతో కలిసి ఆ ఇద్దరు కలిసి పండగలు, ఫంక్షన్లు చేసుకున్న ఫొటోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరి కామన్‌ ఫ్రెండ్స్‌ నుంచి కూడా కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పెళ్లి జరిగింది అనడానికి.. ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పడానికి.. ఇప్పుడు దూరం అయ్యారు అనడానికి పక్కాగా ఆధారాలు ఉండడంతో.. రాజ్‌తరుణ్‌ పేరును చార్జిషీట్‌లో నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కేసు కొత్త మలుపు తీసుకున్నట్లు అయింది. ప్రస్తుతం రాజ్‌తరుణ్‌.. తన కొత్త మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. మరి ఈ చార్జిషీట్‌పై అతను ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ఆసక్తికరంగా మారింది. తనను ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని.. లావణ్య నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాము పదేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు ముంబయికి చెందిన హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని ఆ మధ్య ఆమె మీడియా ముందుకొచ్చింది. రాజ్‌ తరుణ్‌తో తనకి 10 ఏళ్ల కిందటే గుడిలో పెళ్లయిందని తెలిపింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం తనకి అబార్షన్ కూడా చేయించాడంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆసుపత్రి వివరాలను కూడా పోలీసులకి ఆమె అందజేసింది. అన్విక పేరుతో రాజ్ తనని విదేశాలకి కూడా చాలా సార్లు తీసుకెళ్లాడని ఆమె చెప్పుకొచ్చింది. ఈ కేసు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐతే చార్జిషీట్‌లో రాజ్‌తరుణ్ పేరు చేర్చంతో.. ధర్మమే గెలిచిందని లావణ్య ఆనందం వ్యక్తం చేస్తోంది.