vishwambhara : విశ్వంభర టీంలోకి కునాల్ కపూర్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భోళాశంకర్ రిజల్ట్ తో డల్ అయ్యారు. కానీ చిరు ఎప్పుడైతే విశ్వంభరని ఎనౌన్స్ చేసాడో, ఇక అప్పటినుంచి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 14, 2024 | 02:25 PMLast Updated on: Jun 14, 2024 | 2:25 PM

Fans Of Megastar Chiranjeevi Are Stunned By Bholashankars Result

 

 

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భోళాశంకర్ రిజల్ట్ తో డల్ అయ్యారు. కానీ చిరు ఎప్పుడైతే విశ్వంభరని ఎనౌన్స్ చేసాడో, ఇక అప్పటినుంచి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే చిరు రేంజ్ కి తగ్గ కథ తో, బడ్జట్ తో విశ్వంభర తెరకెక్కుతుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ కావడంతో, తమ రోజు వారి పనులు చేసుకుంటునే అప్ డేట్స్ మీద ఒక లుక్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక న్యూస్ వాళ్ళ అంచనాలని రెట్టింపు చేస్తుంది.

తాజాగా విశ్వంభర టీంలోకి బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కునాల్ కపూర్ చేరాడు. 2004 లో వచ్చిన మీనాక్షి అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన రంగ్ దే బసంతి లో ఒక ముఖ్య పాత్ర పోషించి భారతీయ సినీ ప్రేక్షకులు తన వైపు చూసేలా చేసుకున్నాడు. హ్యాట్రిక్, డాన్ 2 , లాంఛ్, డియర్ జిందగీ, గోల్డ్, దేవదాస్, వీరం ఇలా ఎన్నో చిత్రాల్లో లెక్కకు మించిన పాత్రలని పోషించాడు. పైగా అవన్నీ కూడా ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయినవే. ఇప్పుడు విశ్వంభర లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ మేరకు యూనిట్ అధికార ప్రకటన కూడా ఇచ్చింది. విద్యుదీకరణ చరిష్మా కలిగిన నటుడు కి స్వాగతం అనే క్యాప్షన్ ని కూడా జోడించారు. దీన్ని బట్టి కునాల్ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ఆయన క్యారక్టర్ కి బిగ్ ఇంపార్టెన్స్ కూడా ఉండబోతుంది.

ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ అయితే నిర్విరామంగా జరుగుతుంది.చిరు ఏకాగ్రత మొత్తం విశ్వంభర మీదనే ఉంది. ఇక చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత త్రిష హీరోయిన్ గా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇంకో ముగ్గురు హీరోయిన్లకి కూడా చోటు ఉందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అందులో ఒకరిగా ఆషిక రంగ నాధ్ కన్ఫార్మ్ అయ్యింది. గత సంక్రాంతికి నాగ్ తో నా సామి రంగ అంటూ వచ్చి హిట్ కొట్టింది. ఇతర నటినటులు గురించి కూడా త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ప్రభాస్ మిర్చి నిర్మాతలు అయిన వంశీ, ప్రమోద్ లు యూవీ క్రియేషన్స్ పై అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకుడు కాగా ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.