Chiranjevi: ఏం కర్మ రా బాబు.. చిరంజీవి ఛీ కొట్టాడా..?

పూరీ జగన్నాథ్ ఏ ముహుర్తాన లైగర్ మూవీ కథ రాసి,సినిమా తీశాడో కాని. ఆ ఎఫెక్ట్ ఇంకా తన మీదుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఆఫర్ ఇచ్చాడు. కాని పూరీ సరైన కథ చెప్పలేకపోయాడు. బాలయ్య కూడా పైసావసూల్ కిమించే కథదో రమ్మంటే, సగం కథతోనే వెళ్లాడట.. అది తుస్సుమంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2023 | 07:15 PMLast Updated on: Apr 24, 2023 | 7:15 PM

Film Director Puri Jagannath Direction Offers

సరే ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ ప్లాన్ చేశాడన్నారు. ఇంతలోనే లేదు విశ్వక్ సేన్ కి కథ చెప్పాడని ప్రచారం జరిగింది. ఇంతకి పూరీ దారెటు..మొన్నటి వరకేమో చిరంజీవి సినిమా, బాలయ్య మూవీ అంటూ ఈ పెద్ద హీరోల్లో ఎవరో ఒకర్ని ఇంప్రెస్ చేయటానికి నలిగిపోయాడు. ఇప్పుడు ఆస్థాయి నుంచి కుర్ర హీరోలు విశ్వక్ సేన్, రామ్ మధ్య నలుగుతున్నాడు.

పూరీకి కథల కరువొచ్చిందా? పెన్ బరువెక్కిందా? ఎందుకు చిరు, బాలయ్యలని ఇంప్రెస్ చేయలేకపోయాడు? ఇంకెదుకు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కి కూడా కంగారుపడుతున్నాడు.? ఇవి పూరీ మీద ఇండస్ట్రీలో పెరుగుతున్న డౌట్లు. ఇవి అదేదో కొత్త దర్శకుడిలా సినిమా ఫైనల్ చేసేందుకు పూరీ పడుతున్న పాట్లు..