GUNTUR KAARAM: గురూజీ ఎక్కడ..? త్రివిక్రమ్ లేకుండా గుంటూరు కారం సెలబ్రేషన్స్‌

రీసెంట్‌గా దిల్‌రాజు తన ఇంట్లో గుంటూరు కారం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశాడు. ఈ ఈవెంట్‌కు మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి వచ్చాడు. గుంటూరు కారం టీం, సినీ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. కానీ త్రివిక్రమ్, తమన్‌ మాత్రం రాలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2024 | 01:59 PMLast Updated on: Jan 16, 2024 | 1:59 PM

Guntur Kaaram Celebrations Trivikram And Thaman Not Attended To Party

GUNTUR KAARAM: మాటల మాంత్రికుడు గురూజీ రాసే డైలాగ్స్‌ను పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో చెప్పగలిగే తక్కువ మంది హీరోల్లో మహేష్‌ బాబు ఒకడు. సినిమా ఎలా ఉన్నా.. వీళ్లిద్దరి కాంబినేషన్‌కు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ వస్తోంది అంటే ఫ్యాన్స్‌ ఎంత సంతోషంగా ఫీలవుతారో.. అంతే భయపడతారు కూడా. ఎందుకంటే వీళ్లిద్దరి కాంబినేషన్‌కు ఉన్న ట్రాక్‌ రికార్డ్‌ అలాంటిది. గురూజీ, మహేష్‌ కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నాయో అందరం చూశాం.

MAHESH BABU: మ‌హేశ్‌బాబుకు మ‌రో కొత్త టెన్ష‌న్‌..

దీంతో గుంటూరు కారం విషయంలో కూడా మళ్లీ ఇదే రిపీట్‌ అవుద్దా అని మహేష్‌ ఫ్యాన్స్‌ చాలా భయపడ్డారు. ఫ్యాన్స్‌ దేని గురించి భయపడ్డారో సినిమా రిలీజ్‌ అయ్యాక సరిగ్గా అదే జరిగింది. ఫ్యాన్స్‌ ఆశలమీద అనుకున్నట్టుగానే నీళ్లు చల్లాడు గురూజీ. అయితే ఇక్కడ విషయం సినిమా గురించి కాదు. దిల్‌ రాజ్‌ ఇంట్లో జరిగిన ఈవెంట్‌ గురించి. రీసెంట్‌గా దిల్‌రాజు తన ఇంట్లో గుంటూరు కారం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశాడు. ఈ ఈవెంట్‌కు మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి వచ్చాడు. గుంటూరు కారం టీం, సినీ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. కానీ త్రివిక్రమ్, తమన్‌ మాత్రం రాలేదు. దీంతో వాళ్లెందుకు రాలేదు అన్న చర్చ మొదలైంది. నార్మల్‌గా డైరెక్టర్‌ అంటేనే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌. అలాంటి సినిమా సక్సెస్‌ మీట్‌కు ఆయనే రాకపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. గుంటూరు కారం ఫస్ట్‌ షో పడ్డ తరువాత ఆడియన్స్‌ నుంచి విపరీతమైన నెగటివ్‌ టాక్‌ వచ్చింది. కొందరైతే గురూజీ కనిపిస్తే కొట్టేస్తాం అన్న రేంజ్‌లో మాట్లాడారు.

ఇక తమన్‌ గురించి వచ్చిన ట్రోల్స్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడం కారణంగానే గురూజీ ఈవెంట్‌‌కు రాలేదని తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేసింది. సెట్‌లో కూడా చాలాసార్లు మహేష్‌ బాబుకు త్రివిక్రమ్‌కు మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని.. మహేష్‌ రెండు, మూడుసార్లు సెట్‌ నుంచి కూడా వెళ్లిపోయాడని టాక్‌. ఇది కూడా గురూజీ రాకపోవడానికి ఓ కారణమని కొందరంటున్నారు. ఏది ఏమైనా సినిమా తీసిన వ్యక్తే ఆ సినిమాకు సంబంధించిన సెలబ్రేషన్స్‌కు రాకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.