GUNTUR KAARAM: మావా ఎంతైనా పర్లేదు బిల్లు అంటున్న మహేశ్.. కొత్త సాంగ్ విడుదల

మహేష్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు పూనకాలు తెప్పించే రేంజ్‌లో నాలుగో సాంగ్ రిలీజ్ అయ్యింది. గుంటూరు కారం నుంచి ఇప్పటి వరకు మూడు సాంగ్‌లు రిలీజ్ అయ్యాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ ఆల్రెడీ ట్రెండింగ్‌లో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2024 | 05:45 PMLast Updated on: Jan 10, 2024 | 5:45 PM

Guntur Kaaram Movie New Song Mawa Enthaina Released

GUNTUR KAARAM: గుంటూరు కారానికి ఎంత ఘాటు ఉంటుందో మహేష్ నటనకి కూడా అంతే ఘాటు ఉంటుంది. ఇంకెంత.. మహా అయితే రెండంటే రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు మహేష్ సునామితో ఉగిపోనున్నాయి. అల్ రెడీ రిలీజ్ అయిన ట్రైలర్‌తో, మూడు సాంగ్స్‌తో మంచి ఊపు మీద ఉన్న మహేష్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు పూనకాలు తెప్పించే రేంజ్‌లో నాలుగో సాంగ్ రిలీజ్ అయ్యింది. గుంటూరు కారం నుంచి ఇప్పటి వరకు మూడు సాంగ్‌లు రిలీజ్ అయ్యాయి.

GUNTUR KAARAM: ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మహేశ్ సరికొత్త రికార్డు.. గుంటూరు కారం ఎన్ని షోలంటే..

కుర్చీ మడత పెట్టి సాంగ్ ఆల్రెడీ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు తాజాగా మావ ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. లిరికల్ వీడియోతో రిలీజ్ అయిన ఆ సాంగ్ చూస్తుంటే మహేష్ నటనకి సంబంధించి ఇంతవరకు ఎవరు చూడని ఒక సరికొత్త కోణాన్ని చూడబోతున్నామని చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. అలాగే ఆ సాంగ్ కథలో చాలా కీలకమని కూడా తెలుస్తుంది. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో వచ్చిన ఆ పాటలోని లిరిక్స్ మొత్తం ప్రతి ఒక్కరు పాడుకునేలా చాలా క్యాచీగా, అర్థవంతంగా ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి తన గుండెల్లో ఎప్పటినుంచో ఉన్న బాధని బయటకి చెప్పినట్టుగా ఉంది.

శ్రీ కృష్ణ, రామాచారిలు ఆలపించిన ఈ సాంగ్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్ లో ఉండటంతో పాటు లైక్స్ ని కూడా భారీ స్థాయిలో సాధిస్తుంది. ఇప్పుడు ఈ సాంగ్‌తో మహేష్ అభిమానుల హంగామా మాములుగా లేదు. అలాగే థమన్ సూపర్‌గా ట్యూన్‌‌ అందించాడని కూడా అంటున్నారు.