Actress Anasuya : ఫ్యాన్స్ కి గుండె బద్దలయ్యే న్యూస్.. కఠినమైన నిర్ణయం తీసుకున్న యాంకర్ అనసూయ

అనసూయ ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. కానీ కొన్ని సార్లు అనసూయను విమర్శించే వాళ్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. ఈ పోస్ట్ చూస్తే ఎవరో అనసూయను బాగా హర్ట్ చేసినట్లు తెలుస్తోంది. తన మర్యాదకు భంగం కలిగించినట్లు తనను ఎవరో బాగా బాధపెట్టినట్లు అర్థం అవుతోంది. దీంతో ఇకపై వాళ్లను ఎట్టి పరిస్థితిలోను కలిసేది లేదంటోంది. ‘‘ఎడబాటే అగౌరవానికి నా సమాధానం. ఇక నేను స్పందించను, ఎవరితో వాదనకు దిగను, నటించను, సింపుల్‌గా కలవడం మానేస్తా అంతే’’ అంటూ పోస్టులో రాసుకొచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2023 | 05:01 PMLast Updated on: Nov 24, 2023 | 5:01 PM

Heartbreaking News For Fans Anchor Anasuya Took A Tough Decision

టాప్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ స్టేజ్ నుంచి తాను అగ్ర హీరోల సినిమాల్లో నటించే స్థాయికి వెళ్లింది. ప్రస్తుతం అనసూయ ఓ కఠినమైన నిర్ణయం తీసుకుందట. ఇది నిజంగా అభిమానులకు గుండెలు బద్దలయ్యే న్యూస్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు అనసూయ. సినిమాల్లో కంటే కూడా తనకు సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే తన హాట్ ఫోటో షూట్స్, సినిమా అప్డేట్స్, టూర్స్, ఫ్యామిలీ పార్టీలు, ఈవెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి తన అభిమానులతో పంచుకుంటుంది.

Allu Arjun Romance  Trisha : త్రిషతో అల్లు అర్జున్ రొమాన్స్.. తలపట్టుకుంటున్న ఫ్యాన్స్..

అనసూయ ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. కానీ కొన్ని సార్లు అనసూయను విమర్శించే వాళ్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. ఈ పోస్ట్ చూస్తే ఎవరో అనసూయను బాగా హర్ట్ చేసినట్లు తెలుస్తోంది. తన మర్యాదకు భంగం కలిగించినట్లు తనను ఎవరో బాగా బాధపెట్టినట్లు అర్థం అవుతోంది. దీంతో ఇకపై వాళ్లను ఎట్టి పరిస్థితిలోను కలిసేది లేదంటోంది. ‘‘ఎడబాటే అగౌరవానికి నా సమాధానం. ఇక నేను స్పందించను, ఎవరితో వాదనకు దిగను, నటించను, సింపుల్‌గా కలవడం మానేస్తా అంతే’’ అంటూ పోస్టులో రాసుకొచ్చింది.

అయితే అనసూయ ఈ కామెంట్స్ ఎవరినో ఉద్దేశించి చేసింది. వారేవరబ్బా ఇలా సస్పెన్స్‌లో పెట్టిందేంటి .. వామ్మో అనసూయ ఓ నిర్ణయం తీసుకుందంటే అది చాలా కఠినంగా ఉంటుంది. మరీ ఈ ముద్దుగుమ్మ ఎవరికి గుడ్ బై చెప్పి ఉంటుందంటూ నెటిజన్లు తెలుసుకునేందుకు క్యూరియాసిటీతో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అనసూయ పోస్ట్ నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.