SSMB28: తిండి లేక కాకులు అరుస్తున్నాయి.. నెగెటివ్‌ రూమర్స్‌పై నాగవంశీ కౌంటర్‌!

త్రివిక్రమ్, మహేష్‌ కాంబోలో వస్తున్న మూడో సినిమా మీద ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సడెన్‌గా సినిమా ఆగిపోయిందని తెలియడంతో ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. ఏం జరుగుతోందని ఇంటర్నెట్‌లో తెగ పోస్టులు పెడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2023 | 03:04 PMLast Updated on: Apr 28, 2023 | 3:04 PM

Is Mahesh Babu And Trivikram Srinivas Ssmb28 Shelved Producer Naga Vamsi Clarifies

SSMB28: ఓ పెద్ద సినిమా వస్తోందంటే దాని చుట్టూ పాజిటివ్‌తో పాటు నెగెటివ్‌ రూమర్స్‌ ఉండటం కామన్‌. కొన్ని సార్లు ఈ రూమర్స్‌ మితిమీరి మేకర్స్‌కు ప్రాబ్లమ్స్‌ క్రియేట్‌ చేస్తాయి. ఇప్పుడు మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న SSMB28 గురించి కూడా ఇలాంటి నెగెటివ్‌ రూమర్స్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఆగిపోయిందని కొందరు పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం మరీ అడ్వాన్స్‌గా సినిమా ఎందుకు క్యాన్సిల్‌ అయ్యిందో రీజన్స్‌ కూడా చెప్పేస్తున్నారు. త్రివిక్రమ్, మహేష్‌ కాంబోలో గతంలో వచ్చిన రెండు సినిమాలు థియేటర్‌లో పెద్దగా ఆడకపోయినా.. మంచి ఎంటర్టైనర్‌ సినిమాలుగా నిలిచాయి. దీంతో వాళ్లిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా మీద ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సడెన్‌గా సినిమా ఆగిపోయిందని తెలియడంతో ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. ఏం జరుగుతోందని ఇంటర్నెట్‌లో తెగ పోస్టులు పెడుతున్నారు. ఇది నిజమేనా అంటూ అక్కడా ఇక్కడా ఆరా తీస్తున్నారు. ఇవన్నీ చూసిన ప్రొడ్యూసర్‌ నాగవంశీ సీరియస్‌ అయ్యాడు. రూమర్స్‌ అన్నిటీకి చెక్‌ పెట్టాడు.

సినిమా ఆగిపోయిందంటూ ఓ వెబ్‌సైట్‌ పబ్లిష్‌ చేసిన ఆర్టికల్‌ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసి ఘాటుగా స్పందించాడు. పెద్ద ప్రాజెక్ట్‌ల మీద రూమర్స్‌ క్రియేట్‌ చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారంటూ ఫైర్‌ అయ్యాడు. ఈ కాకులన్నీ తిండి లేక అరుస్తున్నాయి. వాటి కడుపు నింపుకొనేందుకు పక్కవాళ్ల కడుపు కొట్టాలని చూస్తున్నాయి. ఫ్యాన్స్‌ ఎవరూ ఇలాంటి రూమర్స్‌ నమ్మొద్దని చెప్పాడు. ప్రస్తుతం మహేష్‌ బాబు ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉన్నాడని, అక్కడి నుంచి రాగానే సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌ చేస్తామని చెప్పాడు. కాస్త ఓపిక పడితే అనుకున్న టైంకే సినిమాను రిలీజ్‌ చేస్తామని చెప్పాడు. కొందరు వ్యక్తులు కేవలం అటెన్షన్‌ కోసం ఇలాంటి చిల్లర పనులు చేస్తుంటారని సీరియస్‌ అయ్యాడు. ఫ్యాన్స్‌ ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండాలని.. సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఉన్నా తామే స్వయంగా ఫ్యాన్స్‌కు చెప్తామన్నాడు. నాగవంశీ ట్వీట్‌తో మహేష్‌ ఫ్యాన్స్‌ కాస్త రిలాక్స్‌ అయ్యారు.