అల్లు అర్జున్… పవన్ కాళ్ళు కడిగి నీళ్ళు జల్లుకోవాలి

ఏ ముహూర్తంలో అల్లు అర్జున్... వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి సపోర్ట్ చేసారో తెలియదు గాని అక్కడి నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ గా వాతావరణం మారిపోయింది. ఈ వివాదం రోజు రోజుకి పెద్దది అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2024 | 10:58 AMLast Updated on: Aug 29, 2024 | 10:58 AM

Janasena Leader Comments On Allu Arjun

ఏ ముహూర్తంలో అల్లు అర్జున్… వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి సపోర్ట్ చేసారో తెలియదు గాని అక్కడి నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ గా వాతావరణం మారిపోయింది. ఈ వివాదం రోజు రోజుకి పెద్దది అవుతోంది. ఈ వివాదంలోకి ఇప్పుడు జనసేన నేతలు అడుగుపెట్టడం మరింత వివాదాన్ని పెద్దది చేసింది. ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో వార్ మొదలయింది. పుష్ప 2 సినిమాను టార్గెట్ చేయాలని మెగా ఫ్యాన్స్ రెడీ గా ఉన్నారు. అదే సమయంలో రామ్ చరణ్ సినిమాను కూడా ఇబ్బంది పెట్టె ప్లాన్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.

ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు మెగా అభిమానులు ఒకటే అంటే, బ్రాంచ్ లు ఏమీ లేవని ఆయన మాట్లాడారు. అల్లు ఫ్యాన్స్ ఎవరో తనకు తెలియదు అంటూ ఆయన కామెంట్స్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు సీరియస్ అయ్యారు. తనకు గాని తన పార్టీకి గాని అల్లు అర్జున్ తో ఏ గొడవలు లేవని, అల్లు అర్జున్ మాట్లాడితేనే తాను మాట్లాడా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మళ్ళీ అల్లు అర్జున్ మాట్లాడితే తాను కచ్చితంగా రియాక్ట్ అవుతా అన్నారు.

ఇక ఇప్పుడు మరో నేత అల్లు అర్జున్ పై విమర్శలు చేసారు. అల్లు అర్జున్ సంస్కార హీనుడు అంటూ కామెంట్ చేసారు. చిరంజీవి భావితరాలకు ఆదర్శం అన్నారు ఆయన. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏంటీ అంటూ ప్రశ్నించారు. ఆ కుటుంబంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం క్షమించేది లేదని హెచ్చరించారు. తన వ్యాఖ్యాలకు బాధ్యత వహిస్తూ చిరంజీవి , పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటే మంచిది అని లేకపోతే మాత్రం కచ్చితంగా పుష్ప 2 సినిమాను అడ్డుకుంటాం అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరి దీనిపై ఏ విధంగా రియాక్షన్స్ ఉంటాయో చూడాలి.