జానీ మాస్టర్‌ పట్టించింది భార్యేనా.. దిమ్మతిరిగే నిజాలు..

జానీ మాస్టర్‌పై రేప్ కేసు వ్యవహారం... టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. తనపై కేసు నమోదయిన తర్వాత.. జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2024 | 05:14 PMLast Updated on: Sep 19, 2024 | 5:14 PM

Jony Master Arrest In Goa

జానీ మాస్టర్‌పై రేప్ కేసు వ్యవహారం… టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. తనపై కేసు నమోదయిన తర్వాత.. జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. సైబరాబాద్ పోలీసులు గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించాయి. జానీ మాస్టర్ అరెస్ట్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇక జానీ అరెస్ట్ అయ్యారన్న వార్త ఇలా వచ్చిందో లేదో.. ఆయన భార్య అయేషా.. నార్సింగి పీఎస్‌కు వచ్చేశారు. ఇది హాట్‌టాపిక్ అయింది. మీడియాతో ఎక్కువగా మాట్లాడటానికి నిరాకరించిన ఆయేషా.. తనకి జానీ మాస్టర్‌ని పీఎస్‌కి తీసుకొచ్చినట్టుగా ఒక ఫేక్ కాల్ వచ్చిందని.. దాని గురించి కనుక్కోవడానికే వచ్చానని చెప్పి… ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోయింది.

ఇక్కడే కొత్త ప్రచారం మొదలైంది. అసలు జానీ మాస్టర్ ఆచూకీ పోలీసులకి అయేషానే చెప్పిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అదే నిజం అయితే.. అయేషా ఎందుకు అలా చేసింది. ఎక్కువ రోజులు కనిపించకుండా పోతే.. మరింత నష్టం జరుగుతుందని భావించిందా… కావాలని అతను అడ్రస్ చెప్పిందా అనే చర్చ జరుగుతోంది. ఇక అటు బాధిత లేడీ డాన్సర్ తన ఫిర్యాదులో… అయేషాని కూడా చేర్చారు. ఇక అటు ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగులో ఓ టాప్ ఛానెల్‌లో ప్రసారమైన డ్యాన్సింగ్ రియాలిటీ షోలో పాల్గొన్న సమయంలో ఓ యువతి జానీ మాస్టర్‌కు పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో తెలిపారు.

కొద్దిరోజుల్లోనే ఆమెకు తన దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం కల్పించాడు. ఐతే అటు జానీ మాస్టర్ కారణంగా తాము ఇబ్బందిపడినట్లు కొందరు కొరియోగ్రాఫర్లు ఆరోపిస్తున్నారు. ఆట సందీప్, హరనాథ్ మాస్టర్ సహా 100 మంది కొరియోగ్రాఫర్లను జానీ తొక్కేశాడని బషీర్ మాస్టర్ ఆరోపించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లను బానిసల మాదిరిగా చూడొద్దని బషీర్ మాస్టర్ సూచించారు. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది.. ఎవడి పొట్టా కొట్టొద్దని, అలాంటొళ్లు బాగుపడ్డ దాఖలాలు లేవని బషీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.