నా భర్తను 2, 3 గంటలు… జానీ మాస్టర్ భార్య సంచలనం

జూనియర్ డాన్సర్ ను జానీ మాస్టర్ అత్యాచారం చేసాడు అని నమోదు అయిన కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2024 | 01:36 PMLast Updated on: Sep 28, 2024 | 1:36 PM

Jony Master Wife Complaint To Filim Chamber Of Commerce

జూనియర్ డాన్సర్ ను జానీ మాస్టర్ అత్యాచారం చేసాడు అని నమోదు అయిన కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసారు. కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసింది అని ఆమె పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది అని ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని నా భర్త జానీ మాస్టర్ ను ఇంటికి రాకుండా అడ్డుకునేది అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది అని బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ ను నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను అని సంచలన వ్యాఖ్యలు చేసారు సుమలత. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించిందని సుమలత చెప్పుకొచ్చారు.

నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలు అక్రమ సంబంధం ఉందని ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడన్నారు. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టిందని ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుందని బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందని సుమలత వ్యాఖ్యానించారు. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నాకు నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్ళదే బాధ్యత అని ఆమె స్పష్టం చేసారు. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను అని విజ్ఞప్తి చేసారు.