పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ భార్య చిందులు.. వదలను అంటూ వార్నింగ్

జూనియర్ డాన్సర్ ను వేధించిన కేసు విషయంలో జానీ మాస్టర్ పై అతని భార్యపై సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ ను ఎలా అయినా అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం చేసిన పోలీసులు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2024 | 02:09 PMLast Updated on: Sep 19, 2024 | 2:09 PM

Jony Master Wife Serious On Media

జూనియర్ డాన్సర్ ను వేధించిన కేసు విషయంలో జానీ మాస్టర్ పై అతని భార్యపై సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ ను ఎలా అయినా అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం చేసిన పోలీసులు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే తన భర్త విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యలు కూడా చేసారు. బాధితురాలి ఫిర్యాదులు జానీ మాస్టర్ భార్య కూడా ఉంది.

తన భర్తను పెళ్లి చేసుకోవాలని ఆమె వేధించింది అంటూ జానీ మాస్టర్ భార్యపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. పలు మార్లు తన ఇంటికి వచ్చి తనను వేధించింది అని కూడా పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఇక నార్సింగి పోలీసులు ఈ కేసు విషయంలో సీరియస్ గా ఉండటంతో జానీ మాస్టర్ భార్యను కూడా పోలీస్ స్టేషన్ కు పిలిచారు. నర్సింగి పోలీస్ స్టేషన్ కి చేరుకున్న జానీ మాస్టర్ భార్య అయేషా అక్కడ కాసేపు హడావుడి చేసారు. ఆయేషా ఇచ్చిన సమాచారం తోనే జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

ఇప్పటికే గోవా నుండి హైదరాబాద్ కి జానీ మాస్టర్ ను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తరలిస్తున్నారు. జానీ మాస్టర్ భార్య ను సైతం తన పై దాడికి పాల్పడిందని ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆయేషాను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ఆమె మీడియాపై చిందులు వేసారు. జానీ మాస్టర్ కేసుకు సంబంధించి వివరాలు అడగడానికి ప్రయత్నం చేసిన మీడియా ప్రతినిధులపై ఆమె మండిపడ్డారు. తనకే కెమెరా పెడతారా మీపై కేసులు పెడతానంటూ మీడియాను జానీ మాస్టర్ భార్య అయేషా బెదిరించారు. తన భర్తపై తప్పుడు ప్రచారం చేసిన ఎవరిని వదలను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.