ముంబై ఫ్లైట్ ఎక్కేస్తున్న కీర్తి

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 17, 2024 | 10:00 AMLast Updated on: Aug 17, 2024 | 10:00 AM

Keerthy Suresh Focus On Bollywood

సినిమాల్లోకి వచ్చేది డబ్బు సంపాదన కోసమే. ఎప్పుడో మనం పుట్టక ముందు, సినిమా అనేది ఒకటి ఉంది మనకు తెలియక ముందు నాటకాల పిచ్చితో, నటన పిచ్చితో సినిమాల్లోకి వచ్చే వాళ్ళు. హీరో అయినా హీరోయిన్ అయినా ఇంకెవరు అయినా. ఇప్పుడు ఆ డబ్బు పిచ్చి మరింత ఎక్కువైపోయింది. ఒకప్పుడు వేలు, ఆ తర్వాత లక్షలు, ఇప్పుడు కోట్లు… ఈ పిచ్చితోనే నటులు నటిస్తున్నారు. అందుకోసం ఎక్కడి వరకు అయినా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. హీరోల సంగతి తెలిసిందే గాని హీరోయిన్లు కూడా ఇప్పుడు దేనికి అయినా రెడీ అనడం షాక్ కి గురి చేసే అంశం.

సాధారణంగా మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళే హీరోయిన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. బాలీవుడ్ లో ప్రభావం చూపిన సౌత్ హీరోయిన్లను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కాని ఇప్పుడు అక్కడ జెండా పాతేస్తాం అంటూ కొందరు హీరోయిన్లు ముంబై ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. రోజు రోజుకి ఆ లిస్టు పెరిగిపోతుంది. మొన్నటి వరకు కాజల్ బాలీవుడ్ లో చాలా గట్టిగా ట్రై చేసినా పని జరగలేదు. ఆ తర్వాత సమంతా కొంత సక్సెస్ అయ్యేలా కనపడుతుంది. లేటు వయసులో కూడా సమంతా బాలీవుడ్ సినిమాలకు సైన్ చేస్తుంది. ఒక వెబ్ సీరీస్ లో కూడా నటించింది.

యానిమల్ సినిమాతో రష్మిక బీ టౌన్ కి దగ్గరైంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా కనపడుతుంది. అక్కడ ఆమెకు భారీగానే ఆఫర్ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్… బాలీవుడ్ లో గట్టిగా నిలబడాలని ఫిక్స్ అయిపొయింది. అక్కడ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ వైపు చూడటం హాట్ టాపిక్. తెలుగులో కొన్నాళ్ళుగా హిట్ కోసం తపిస్తున్న ఈ పాపకు ఇప్పుడు బాలీవుడ్ లో ఎలా అయినా సరే నిలబడాలని విశ్వ ప్రయత్నాలు చేసేస్తుంది.

షాహిద్ కపూర్ సినిమా కోసం ఆమె ట్రై చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే రణవీర్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆమెకు అవకాశం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. రణవీర్ సింగ్ కు కీర్తికి మధ్హ్య మంచి స్నేహం ఉంది. దీనితో రణవీర్ కూడా తన సినిమాలో కీర్తికి మంచి రోల్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.