Mahesh Babu: టీజర్ తో ట్రెండ్ ని సెట్ చేస్తూనే.. ఫాలో అవుతానంటున్న మహేశ్ ..

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ అమరావతికి అటు ఇటు.. అఫీషియల్ గా టైటిల్ తేలకున్నా ఇదే పేరుతో అంతా పిలుస్తున్నారు. ఏదేమైనా 55 సెకన్ల నిడివితో త్రివిక్రమ్ ఈ మూవీ గ్లింప్స్ ని ఈనెల 31 న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడట. ఐతే అలా కాదు వన్ డే ముందే టీజర్ ని రిలీజ్ చేయాలని మహేశ్ నిర్ణయించాడట. అంటే ఈనెల 30న ఈ మూవీ టీజర్ ని అది కూడా థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2023 | 05:04 PMLast Updated on: May 15, 2023 | 5:04 PM

Mahesh Babu Trend Set With Teaser

హైద్రబాద్ లో 10 థియేటర్లు, వరంగల్, విజయవాడ, తిరుపతి, వైజాగ్, గుంటూర్, నెల్లూరు, చెన్నై, బెంగళూరు, కొచ్చి, ముంబై, డిల్లీలో ఈ మూవీ టీజర్ ని 5 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారట. అది సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్లానింగ్ అని తెలుస్తోంది.

ఆల్రెడీ ఆదిపురుష్ ట్రైలర్ ని ఇలానే సౌత్, నార్త్ అంతటా 105 థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అచ్చంగా అలానే త్రివిక్రమ్,మహేశ్ మూవీని దేశవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగ్గ ఏర్పాట్లు త్రివిక్రమ్ చేస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి సూపర్ స్టార్ కృష్ణ జయంతికి ఒకరోజు ముందే థియేటర్స్ లో మహేశ్ మూవీ టీజర్ రావటం ఫైనలైంది.