మహేష్ తో నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నాడా…? ఇదేం టార్చర్ జక్కన్న…?

దీనెమ్మ రాజమౌళి తో సినిమా అంటే చేసే హీరోల కంటే వాళ్ళ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు ఉండదు. తన సినిమా కోసం ఏళ్ళకు ఏళ్ళు తినేసే జక్కన్న... ఇప్పుడు మహేష్ బాబుతో ఎన్నాళ్ళు సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2024 | 01:45 PMLast Updated on: Oct 01, 2024 | 1:45 PM

Mahesh Fans Tension With Rajamouli Film

దీనెమ్మ రాజమౌళి తో సినిమా అంటే చేసే హీరోల కంటే వాళ్ళ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు ఉండదు. తన సినిమా కోసం ఏళ్ళకు ఏళ్ళు తినేసే జక్కన్న… ఇప్పుడు మహేష్ బాబుతో ఎన్నాళ్ళు సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఏ విధంగా ఉంటుందో అనే ఆందోళన కూడా ఫ్యాన్స్ లో ఉంది. ఇటీవల మహేష్ బాబు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా చాలా వింతగా కనిపించాడు. ఆ లుక్ తోనే మహేష్ బాబు కనపడే అవకాశం స్పష్టంగా ఉంది.

ఆ లుక్ కోసం మహేష్ బాబు ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు. ఇక ఇదిలా ఉంచితే ఇప్పుడు మహేష్ బాబుతో కొన్ని కఠినమైన పనులు చేయిస్తున్నాడట జక్కన్న. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు సైలెంట్ గా పూర్తి చేస్తోంది చిత్ర యూనిట్. రాజమౌళి కుమారుడు కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నాడట. ఇక ఆఫ్రికాలో మహేష్ బాబుతో కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. ఇందుకోసం మహేష్ తో గట్టిగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు జక్కన్న. ఆఫ్రికాలోని సింహాలు, హైనాలు వంటి క్రూర మృగాలు ఉండే సవానా గడ్డి భూముల్లో మహేష్ బాబు షూటింగ్ చేయాల్సి ఉంటుంది.

అక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని మహేష్ బాబు తట్టుకోవాల్సి ఉంది. అందుకనే ఇప్పుడు రాజస్థాన్ లో మహేష్ బాబుతో ఎండలో ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టాడు జక్కన్న. కనీసం చెట్టు కూడా లేని ప్రాంతాల్లో మహేష్ బాబు ఇప్పుడు కష్టపడుతున్నాడని టాక్. ఇటీవల మంచు గడ్డల్లో పడుకుంటున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. ఇలా తన సినిమా కోసం జక్కన్న మహేష్ బాబుని నానా కష్టాలు పెడుతూ నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విజయం ప్రస్తుతం మహేష్ బాబుకి చాలా అవసరం. అందుకే మహేష్ బాబు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టడం లేదని టాక్.